BigTV English

Shashi Tharoor: బంగ్లాదేశ్‌లో పాక్ ఆర్మీ 1971 ఓటమి విగ్రహాలు ధ్వంసం.. ఫొటోలు షేర్ చేసిన శశిథరూర్!

Shashi Tharoor: బంగ్లాదేశ్‌లో పాక్ ఆర్మీ 1971 ఓటమి విగ్రహాలు ధ్వంసం.. ఫొటోలు షేర్ చేసిన శశిథరూర్!

Shashi Tharoor| 1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఓటమి తరువాత పాకిస్తాన్ సైనికులు సరెండర్ చేశారు. అప్పుడు భారత్ సైన్యాధికారులతో పాక్ సైన్యం ఓటమి ఒప్పందం చేసుకుంటున్న దృశ్యం బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి ప్రతీక. ఆ దృశ్యాలు విగ్రహ రూపంలో బంగ్లాదేశ్ లో ఉన్నాయి. ఇటీవల బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసాత్మక దాడుల్లో అల్లరి మూకలు ఆ చరిత్రాత్మక విగ్రహాలను ధ్వంసం చేశాయి. ఆ ధ్వంసమైన విగ్రహాల ఫొటోలను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్విట్టర్ ఎక్స్ ద్వారా షేర్ చేస్తూ.. బాధాకరంగా పోస్టు చేశారు.


‘ముజీబ్ నగర్ లోని 1971 షహీద్ మెమోరియల్ కాంప్లెక్స్ లో ఉన్న ఆ చరిత్రాత్మక విగ్రహాలు నాశనం కావడం చూసి చాలా బాధగా అనిపించింది. బంగ్లాదేశ్ లోని భారత సాంస్కృతిక కేంద్రం, హిందరూ దేవాలయాలు, హిందువులు, మైనారీటీల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ముస్లిం సోదరులే ఈ దాడులు చేస్తున్న అల్లరి మూకలను అడ్డుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం.’ అని థరూర్ తన ట్వీట్ లో రాశారు.

1971 బంగ్లాదేశ్ యుద్ధంలో భారత సైన్యంతో కలిసి బంగ్లాదేశ్ ముక్తి బాహిని సైన్యం పోరాడింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీకి మేజర్ జెనెరల్ అమిర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ నాయకత్వం వహించారు. యుద్ధంలో ఓడిపోయిన తరువాత మేజర్ జెనెరల్ నియాజీ తన 93000 మంది సైనికులతో కలిసి సరెండర్ చేశారు. ఆ సరెండర్ కోసం అధికారికంగా పాకిస్తాన్ ఆర్మీతో భారత సైన్యాధికారి లెఫ్టెనెంట్ జెనెరల్ జగ్జీత్ సింగ్ అరోరా ‘ఇన్స్‌ట్రూమెంట్ ఆఫ్ ఆర్డర్’ సైన్ చేయించారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఒక అతిపెద్ద సైన్య సరెండర్ ఇదే కావడం విశేషం.


Also Read: ఆలయంలో ఘోర విషాదం. తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి

ప్రభుత్వ ఉద్యోగాల కోటా వివాదంపై బంగ్లాదేశ్ లో ఇటీవల మొదలైన విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆ హింసలో బంగ్లాదేశ్ ఆర్మీ, ప్రతిపక్ష పార్టీల హింసకు పాల్పడే విద్యార్థులకు సాయం చేశాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది. పరిస్థితులు దిగజారడంతో ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆమెను దేశం విడిచి వెళ్లేందుకు ఆర్మీ చీఫ్ 45 నిమిషాలు గడువు ఇవ్వడంతో ఆమె అక్కడి నుంచి భారత కు బయలుదేరారు. ప్రస్తుతం షేక్ హసీనాకు తాత్కాలికంగా భారత దేశంలో శరణార్థిగా ఉన్నారు.

Related News

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Big Stories

×