E-Paper
Advertisement

Solar System: ఆకాశంలో ఫైటింగ్.. కనిపించని ఆ గ్రహం.. అన్నింటికీ ఇదే కారణమా?

Solar System: ఆకాశంలో ఫైటింగ్.. కనిపించని ఆ గ్రహం.. అన్నింటికీ ఇదే కారణమా?

Solar System: మన సౌర వ్యవస్థ గురించి మనందరికీ చిన్నప్పటి నుంచే ఒక బేసిక్ అర్థం ఉంటుంది. ఎనిమిది గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతుంటాయనీ, వాటిల్లో భూమి మానవుల నివాసానికి అనుకూలమైనదనీ చదువుతుంటాం. కానీ కొన్ని దశాబ్దాల కిందటివరకు ప్లూటోను మన తొమ్మిదవ గ్రహంగా పరిగణించేవారు. ఆ తర్వాత దాన్ని డ్వార్ఫ్ ప్లానెట్ (మరుగుజ్జు గ్రహం)గా ప్రకటించడంతో తొమ్మిదవ గ్రహం గల్లంతయిపోయింది. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఒక కొత్త మిస్టరీను వెలుగులోకి తీసుకొచ్చారు.

ఆ గ్రహం ఇప్పుడు మన కళ్లకు ఎందుకు కనిపించడం లేదు? దాన్ని ఎవరు కనిపించకుండా చేసారు? ఇదే అంశంపై తాజా పరిశోధనలు జరిగాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. ఈ గ్రహాన్ని బయటకు త్రోసేసినదే మన సౌర కుటుంబంలోనే పెద్దన్న అయిన బృహస్పతి కావొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

బృహస్పతి.. ఎందుకిలా?
బృహస్పతి సౌర వ్యవస్థలో అతి పెద్ద గ్రహం. అది ఒంటరిగా మన భూమిపై ఉన్న అన్ని గ్రహాలను కలిపినా, వాటికన్నా పెద్దది. అంతేకాదు, దాని గురుత్వాకర్షణ శక్తి కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. దాని అద్భుతమైన ఆకర్షణ శక్తికి గురై సిస్టమ్‌లోని చాలా చిన్న గ్రహాలే కాదు, కొందరు పెద్దవాళ్లు కూడా దారితప్పే ప్రమాదం ఉంది. ఇదే జరిగిందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

ఒకప్పుడు మన సౌర వ్యవస్థలో ఐదు వాయు గ్రహాలు ఉండేవని కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్.. ఇంకా మరొకటి! కానీ ఇప్పుడు ఆ ఐదవ వాయు గ్రహం కనిపించడం లేదు. అంటే దాన్ని ఎవరో బయటకు త్రోసేశారు అన్నమాట. ఇప్పుడు ప్లూటోను కాకుండా ఇది కొత్తగా గుర్తించాల్సిన గ్రహం అయిపోయింది.

2011లో మొదలైన అనుమానాలు…
భూమి, అంగారక గ్రహాల కక్ష్యలను శాస్త్రవేత్తలు గమనిస్తున్నప్పుడు కొన్ని విచిత్రమైన మార్పులు కనిపించాయి. ఇవి సహజంగా జరగవు, ఈ మార్పులకు మరొక గ్రహం కారణమై ఉండొచ్చని వారు అనుమానించారు. అప్పుడే Planet Nine అనే సిద్ధాంతం పుట్టింది. అంటే మన సౌర వ్యవస్థలో తొమ్మిదవ గ్రహంగా ఇంకొకటి ఉండేదని, అది ఇప్పుడు కనిపించకపోయినా దీని ప్రభావం ఇంకా ఉన్నదన్నమాట.

దాన్ని బయటకు త్రోసినవాడు ఎవరు?
ఈ ప్రశ్న శాస్త్రవేత్తలను చాలా కాలంగా కలవరపెడుతోంది. ఎవరు ఆ గ్రహాన్ని బయటకు పంపారన్నదే అసలు కథ. 2015లో టొరంటో విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని లోతుగా పరిశీలించారు. వారి విశ్లేషణల ప్రకారం, శని కాదు, బృహస్పతే దాన్ని బయటకు త్రోసేసినట్టు ఆధారాలు కనిపించాయి.

ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన ర్యాన్ క్లౌటియర్ అద్భుతమైన వ్యాఖ్య చేశారు. ఇది గ్రహాల మధ్య చదరంగం ఆటలా ఉంది. కానీ ఇందులో ఒక వంతు మాయా, ఒక వంతు బలవంతం కలిసిపోయి ఉన్నాయని చెప్పారు. అంటే, ఏదో ఒక సమయం బృహస్పతి తన శక్తితో, ఆ అయిదవ వాయు గ్రహాన్ని తీసి అంతరిక్షంలోకి త్రోసేసిందన్నమాట.

ఇప్పుడు ఆ గ్రహం ఎక్కడ ఉంది?
ఇది ఇంకా పెద్ద ప్రశ్నే. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం, అది ఇంటర్‌స్టెల్లార్ అంటే సౌర వ్యవస్థకి బయట ఉన్న అంతరిక్షంలో చాలా దూరం ప్రయాణిస్తూ ఉండవచ్చు. అది మనం ఇప్పటికి కనుగొనలేకపోతున్న Planet Nine కావొచ్చని భావిస్తున్నారు. దీనికి కొన్ని ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి.. కొన్ని ఆస్టరాయిడ్‌లు, శీతగాలులతో నిండిన చిన్న గ్రహాలు, అన్ని ఒకే దిశగా కదులుతున్నట్టు కనిపించడం. అవన్నీ కలిపి చూస్తే, మనం ఇంకా ఏదో పెద్దది మిస్ అవుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

Also Read: AP School Bus: మీ పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కిస్తున్నారా? ఏపీ పేరెంట్స్ జర భద్రం!

మనం ఏమి నేర్చుకోవాలి?
ఈ కథనంలో ఉన్న విషయాలన్నీ ఒక విషయాన్ని చెబుతున్నాయి. మనకు సౌర వ్యవస్థ గురించి తెలిసింది చాలా తక్కువే.. మనం ఊహించేది, చదివేది ఒకవైపు.. కానీ ఖగోళ విజ్ఞానం చాలా మిస్టరీలతో నిండిపోయి ఉంది. Planet Nine గురించి పూర్తిగా కనుగొనకపోయినా, దాని ఉనికి గురించి వచ్చిన ఆధారాలు మరింత లోతుగా ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.

ఇంతవరకూ గ్రహాల కదలికలు, ప్రభావాలు అన్నీ ఒక నిబంధిత క్రమంలో ఉంటాయని మనం నమ్ముతూ వచ్చాం. కానీ ఇప్పుడు ఆ క్రమంలో గందరగోళం ఉందని, దానికి కారణం ఓ తొమ్మిదవ గ్రహం కావొచ్చని అర్థమవుతోంది.

బృహస్పతి ఒక గూండా లా తొమ్మిదవ గ్రహాన్ని సౌర వ్యవస్థ నుంచి తరిమికొట్టాడంటే, అది వినడానికి కథలా అనిపించొచ్చు. కానీ శాస్త్రవేత్తల పరిశోధనలు, గణిత విశ్లేషణలు ఇది వాస్తవం అయ్యే అవకాశాన్ని చూపిస్తున్నాయి. విశ్వం అనేది తారలు మెరిసే నీలాకాశం మాత్రమే కాదు.. దాని లోతుల్లో ఎన్నో రహస్యాలు, మిస్టరీలు దాగున్నాయి. అవి ఒక్కొక్కటిగా బయటపడటం మొదలవుతోంది!

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×