BigTV English
Advertisement

Gateway of India: గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో పడవ కలకలం.. కస్టడీలోకి ముగ్గురు!

Gateway of India: గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో పడవ కలకలం.. కస్టడీలోకి ముగ్గురు!

Suspicious Kuwait Boat Near Gateway of India: ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలోని అరేబియా సముద్రంలో అనుమానాస్పద పడవ కలకలం రేపింది. సముద్రంలో గస్తీ నిర్వహించే పోలీసులు.. మంగళవారం సాయంత్రం కువైట్ నుంచి ముంబైకి చేరుకున్న పడవను స్వాధీనం చేసుకున్నారు. ఆ పడవులో ఉన్న ముగ్గురు వ్యక్తులను కస్టడీలోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ ముగ్గురినీ ఆంటోనీ, నిడిసో డిటో, విజయ్ ఆంటోనీగా గుర్తించారు. పోలీసులు అనుమానించిన ఆ పడవలో ఎలాంటి ఆయుధాలు, అనుమానాస్పద పదార్థాలు లభించలేదు.


పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులూ మత్స్యకారులని, వీరు కువైట్ లో ఉన్న ఒక ఫిషింగ్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తేలింది. తమ యజమాని పనిచేయించుకుని జీతం సరిగ్గా చెల్లించకపోగా.. చిత్రహింసలకు గురిచేసేవాడని, పాస్ పోర్టులు కూడా తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో.. అక్కడి నుంచి తప్పించుకునేందుకు యజమాని పడవను దొంగిలించినట్లు చెప్పారు. 12 రోజులుగా పడవలో ప్రయాణిస్తూ వచ్చామని, రేషన్ అంతా అయిపోవడంతో.. నాలుగు రోజులుగా ఏమీ తినలేదని.. చాలా ఆకలితో ఉన్నామని వాపోయారు.

Read More : Bharat Rice : రూ. 29 కే కిలో బియ్యం.. భారత్ రైస్ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం..


కాగా.. వారంతా సెక్యూరిటీని దాటుకుని.. తీరానికి పడవతో ఎలా చేరుకున్నారన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2008లో పాక్ ఉగ్రవాదులు కొందరు సముద్ర మార్గం ద్వారా.. ముంబైలోకి ప్రవేశించి మారణహోమానికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా కువైట్ పడవ ఘటన.. సముద్ర భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

Big Stories

×