E-Paper
Advertisement

Gateway of India: గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో పడవ కలకలం.. కస్టడీలోకి ముగ్గురు!

Gateway of India: గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో పడవ కలకలం.. కస్టడీలోకి ముగ్గురు!
Advertisement

Suspicious Kuwait Boat Near Gateway of India: ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలోని అరేబియా సముద్రంలో అనుమానాస్పద పడవ కలకలం రేపింది. సముద్రంలో గస్తీ నిర్వహించే పోలీసులు.. మంగళవారం సాయంత్రం కువైట్ నుంచి ముంబైకి చేరుకున్న పడవను స్వాధీనం చేసుకున్నారు. ఆ పడవులో ఉన్న ముగ్గురు వ్యక్తులను కస్టడీలోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ ముగ్గురినీ ఆంటోనీ, నిడిసో డిటో, విజయ్ ఆంటోనీగా గుర్తించారు. పోలీసులు అనుమానించిన ఆ పడవలో ఎలాంటి ఆయుధాలు, అనుమానాస్పద పదార్థాలు లభించలేదు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులూ మత్స్యకారులని, వీరు కువైట్ లో ఉన్న ఒక ఫిషింగ్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తేలింది. తమ యజమాని పనిచేయించుకుని జీతం సరిగ్గా చెల్లించకపోగా.. చిత్రహింసలకు గురిచేసేవాడని, పాస్ పోర్టులు కూడా తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో.. అక్కడి నుంచి తప్పించుకునేందుకు యజమాని పడవను దొంగిలించినట్లు చెప్పారు. 12 రోజులుగా పడవలో ప్రయాణిస్తూ వచ్చామని, రేషన్ అంతా అయిపోవడంతో.. నాలుగు రోజులుగా ఏమీ తినలేదని.. చాలా ఆకలితో ఉన్నామని వాపోయారు.

Advertisement

Read More : Bharat Rice : రూ. 29 కే కిలో బియ్యం.. భారత్ రైస్ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం..

కాగా.. వారంతా సెక్యూరిటీని దాటుకుని.. తీరానికి పడవతో ఎలా చేరుకున్నారన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2008లో పాక్ ఉగ్రవాదులు కొందరు సముద్ర మార్గం ద్వారా.. ముంబైలోకి ప్రవేశించి మారణహోమానికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా కువైట్ పడవ ఘటన.. సముద్ర భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

Big Stories

Advertisement
×