E-Paper
Advertisement

Gateway of India: గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో పడవ కలకలం.. కస్టడీలోకి ముగ్గురు!

Gateway of India: గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో పడవ కలకలం.. కస్టడీలోకి ముగ్గురు!

Suspicious Kuwait Boat Near Gateway of India: ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలోని అరేబియా సముద్రంలో అనుమానాస్పద పడవ కలకలం రేపింది. సముద్రంలో గస్తీ నిర్వహించే పోలీసులు.. మంగళవారం సాయంత్రం కువైట్ నుంచి ముంబైకి చేరుకున్న పడవను స్వాధీనం చేసుకున్నారు. ఆ పడవులో ఉన్న ముగ్గురు వ్యక్తులను కస్టడీలోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ ముగ్గురినీ ఆంటోనీ, నిడిసో డిటో, విజయ్ ఆంటోనీగా గుర్తించారు. పోలీసులు అనుమానించిన ఆ పడవలో ఎలాంటి ఆయుధాలు, అనుమానాస్పద పదార్థాలు లభించలేదు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులూ మత్స్యకారులని, వీరు కువైట్ లో ఉన్న ఒక ఫిషింగ్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తేలింది. తమ యజమాని పనిచేయించుకుని జీతం సరిగ్గా చెల్లించకపోగా.. చిత్రహింసలకు గురిచేసేవాడని, పాస్ పోర్టులు కూడా తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో.. అక్కడి నుంచి తప్పించుకునేందుకు యజమాని పడవను దొంగిలించినట్లు చెప్పారు. 12 రోజులుగా పడవలో ప్రయాణిస్తూ వచ్చామని, రేషన్ అంతా అయిపోవడంతో.. నాలుగు రోజులుగా ఏమీ తినలేదని.. చాలా ఆకలితో ఉన్నామని వాపోయారు.

Read More : Bharat Rice : రూ. 29 కే కిలో బియ్యం.. భారత్ రైస్ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం..

కాగా.. వారంతా సెక్యూరిటీని దాటుకుని.. తీరానికి పడవతో ఎలా చేరుకున్నారన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2008లో పాక్ ఉగ్రవాదులు కొందరు సముద్ర మార్గం ద్వారా.. ముంబైలోకి ప్రవేశించి మారణహోమానికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా కువైట్ పడవ ఘటన.. సముద్ర భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×