Tamil Nadu Elections 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ మెుదలుకాగా.. ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. తమ ఇష్టమైన నేతను గెలిపించుకునేందుకు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కోలివుడ్ కు చెందిన సినీ తారలు సైతం ఉదయాన్నే క్యూలో నిలబడి మరీ ఓట్లు వేస్తున్నారు. సాధారణ పౌరులతో కలిసి వెళ్లి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
కోలీవుడ్ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్.. చెన్నైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీసుల భారీ భద్రత నడుమ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన విజయ్.. రాజ్యాంగం కల్పించిన తన హక్కును వినియోగించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ తరపున విజయ్.. సీఎం అభ్యర్థిగా ఉన్నారు. ఈ ఎన్నికలను ఆయన తీవ్రంగా ప్రభావితం చేస్తారన్న విశ్లేషణలు ఉన్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు-2026: ఓటు హక్కు వినియోగించుకోవడానికి చెన్నైలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న TVK చీఫ్, నటుడు విజయ్
Tamil Nadu Assembly Elections-2026: TVK chief and actor Vijay reaches polling station in Chennai to exercise his right to vote pic.twitter.com/766YW2EMoZ
— BIG TV Breaking News (@bigtvtelugu) April 23, 2026
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్టెల్లా మారిస్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్దకు కూతురు ఐశ్వర్యతో కలిసి వెళ్లి ఓటు వేశారు. అయితే పోలింగ్ కేంద్రంలో రజనీ కాంత్ ను చూసి.. ఓటర్లు ఒక్కసారిగా ఆయన్ను చుట్టుముట్టారు. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఎగబడ్డారు. పోలీసులు కలుగజేసుకొని రజనీకాంత్ ను అక్కడి నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్లారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు-2026: కూతురు సౌందర్యతో కలిసి చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజీలో ఓటు వేసిన సూపర్ స్టార్ రజనీకాంత్
Tamil Nadu Assembly Elections-2026: Superstar Rajinikanth casts his vote at Stella Maris College in Chennai with daughter Soundarya pic.twitter.com/YHjURXhUlc
— BIG TV Breaking News (@bigtvtelugu) April 23, 2026
స్టార్ హీరో, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ సైతం.. ఉదయాన్నే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కూతురు శృతి హాసన్ తో చెన్నైలోని ఆల్వార్ పేట్ పాఠశాలకు వెళ్లి నచ్చిన అభ్యర్థికి ఓటు వేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు-2026: కుమార్తె శృతి హాసన్తో కలిసి చెన్నైలోని ఆల్వార్పేట్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ నటుడు కమల్ హాసన్
Tamil Nadu Assembly Elections-2026: Veteran actor Kamal Haasan casts his vote at a school in Alwarpet, Chennai, along with his… pic.twitter.com/FYQ9UAIcvH
— BIG TV Breaking News (@bigtvtelugu) April 23, 2026
Also Read: నేడే బెంగాల్, తమిళనాడు ఎన్నికలు.. 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం.. ఓట్లు వేస్తున్న ప్రజలు!
మరోవైపు కోలీవుడ్ యాక్షన్ హీరో అజిత్ కుమార్ సైతం.. చెన్నైలోని తిరువాన్మియూర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం చేతి వేలికి ఉన్న సీరా గుర్తును చూపిస్తూ.. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న సందేశాన్ని ఇచ్చారు. అంతకుముందు బీజేపీ నేత, సినీ నటి కుష్బూ సైతం చెన్నై మైలాపూర్ లోని పోలింగ్ బూత్ కు వచ్చి ఓటువేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు-2026: చెన్నైలోని తిరువాన్మియూర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన ప్రముఖ నటుడు అజిత్ కుమార్
Tamil Nadu Assembly Elections-2026: Popular actor Ajith Kumar casts his vote at Thiruvanmiyur polling station in Chennai pic.twitter.com/S39yCYlmVS
— BIG TV Breaking News (@bigtvtelugu) April 23, 2026
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు-2026లో భాగంగా మైలాపూర్లోని పోలింగ్ బూత్లో ఓటు వేసిన ఖుష్బూ
Tamil Nadu Elections 2026: State BJP vice president Khushbu Sundar casts her vote at a polling booth in Mylapore pic.twitter.com/LkcVhmwIi8
— BIG TV Breaking News (@bigtvtelugu) April 23, 2026
Also Read: నరరూప రాక్షసుడు.. రెండ్రోజుల్లో 2 అత్యాచారాలు, ఒక హత్య.. బాధితుల్లో IRS అధికారి కుమార్తె!