E-Paper
Advertisement

Lok Sabha Elections 2024: ముగిసిన తొలి విడత లోక్ సభ ఎన్నికలు.. టాప్‌లో త్రిపుర..!

Lok Sabha Elections 2024: ముగిసిన తొలి విడత లోక్ సభ ఎన్నికలు.. టాప్‌లో త్రిపుర..!
Advertisement

Lok Sabha Elections 2024: దేశవ్యాప్తంగా తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 102 లోక్ సభ స్థానాలకు గాను నిర్వహించిన తొలి దశ పోలింగ్ సాయంత్ర 6 గంటలకు ముగిసింది.

21 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈ ఎన్నికల్లో మొత్తం 21 రాష్ట్రాల్లో 59.71 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పశ్చిమబెంగాల్ లో అత్యధికంగా 77.57 శాతం పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. బీహార్ లో అత్యల్పంగా 46.32 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఈ తొలి విడతలో గతంలో కంటే ఎక్కువగానే పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Advertisement

1.అండమాన్ అండ్ నికోబార్- 56.87
2.అరుణాచల్ ప్రదేశ్-64.07
3.అస్సాం-70.77
4.బీహార్-46.32
5. చత్తీస్‌గఢ్-63.41
6.జమ్ముకశ్మీర్-65.08
7.లక్షద్వీప్-59.02
8.మధ్యప్రదేశ్-63.25
9.మహారాష్ట్ర-54.85
10. మణిపూర్-68.62
11.మేఘాలయ-69.91
12.మిజోరాం-53.96
13.నాగాలాండ్-56.18
14.పాండిచ్చేరి-72.84
15.రాజస్థాన్-50.27
16.సిక్కిం-68.06
17.తమిళనాడు-62.08
18.త్రిపుర-80.17
19.ఉత్తరప్రదేశ్-57.54
20.ఉత్తరాఖాండ్-53.56
21.పశ్చిమబెంగాల్-77.57

మణిపూర్ లో చిన్నచిన్న ఘర్షణలు స్థానిక ఓటర్లను భయపెట్టినా సరే.. మిగతా అన్ని చోట్లా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. కాగా, ఈ ఎన్నికల్లో పలువురు సినీతారలు, సీనియర్ రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×