E-Paper
Advertisement

Congress Party: మరో నోటీసు.. రూ. 1,745 కోట్లు కట్టాలని కాంగ్రెస్‌కు ఐటీ సమన్లు

Congress Party: మరో నోటీసు.. రూ. 1,745 కోట్లు కట్టాలని కాంగ్రెస్‌కు ఐటీ సమన్లు
Congress Party
Congress Party

Congress Party: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీని బీజేపీ ప్రభుత్వం కష్టాల ఊబిలోకి నెట్టేలా చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఐటీ శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. 1,745 కోట్లు కట్టాలని సూచిస్తూ మరోసారి సమన్లు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే(రెండ్రోజుల క్రితం) రూ. 1,823 కోట్లు చెల్లించాలని కోరుతూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి వేల కోట్లు చెల్లించాలంటూ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

2014-15, 2016-17 సంవత్సరాలకు సంబంధించి రూ. 1,745 కోట్లు చెల్లించాలని ఐటీ శాఖ తమకు నోటీసులు జారీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తం రూ. 3,567 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ మొత్తాన్ని చెల్లించాలని కోరుతూ మరో నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది.

Also Read: మరో పడవ హైజాక్.. భారత నేవి డేరింగ్ ఆపరేషన్

2017-18, 2020-21 సంవత్సరాలకు సంబంధించి వడ్డీతో సహా రూ. 1823 కోట్లు చెల్లించాలని ఐటీ శాఖ స్పష్టం చేసింది. అయితే ఐటీ శాఖ నోటీసులను సవాలు చేస్తూ కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఐటీ శాఖ చేపట్టిన ఈ విధానాన్ని నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మరుసటి రోజే నోటీసులు రావడం గమనార్హం. ఈ ప్రక్రియ కోసం అవసరమైన ఆధారాలు తమ వద్ద ఉన్నట్లు ఐటీ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఈ విషయంతో జోక్యం చేసుకోలేమని కోర్టు తెలిపింది.

ఢిల్లీ హైకోర్టు పిటిషన్ తిరస్కరించడంతో కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల వేళ నిధుల కొరత ఏర్పడిందని ఇప్పటికే హైకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్‌లో కాంగ్రెస్ పేర్కొంది. ఈ మేరకు రేపు అత్యున్నత న్యాయస్థాన్ని ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×