E-Paper
Advertisement

Flight Crash: అయ్యో దేవుడా.. ముక్కలైన విమానం.. చెల్లా చెదురైన శరీర భాగాలు

Flight Crash: అయ్యో దేవుడా.. ముక్కలైన విమానం.. చెల్లా చెదురైన శరీర భాగాలు
Advertisement

Flight Crash: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎయిర్ పోర్ట్ సమీపంలో విమాన ప్రమాదం జరిగింది. నగరంలోని సివిల్ ఆస్పత్రి సమీపంలో బీజే మెడికల్ కాలేజీపై విమానం కుప్పకూలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ అయిన 2 నిమిషాలకే విమాన ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. అయతే ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో వంద మంది ప్రయాణికులు, 20 మంది మెడికల్ కాలేజీ డాక్టర్లు మృతిచెందినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో ఇద్దరు ఫైలట్లు, పది మంది విమాన సిబ్బంది, 230 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

Advertisement

అయితే, ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో చూస్తుంటే.. అత్యంత భయంకరంగా ఉన్నాయి. విమానం పేలిపోవడంతో.. ఫ్లైట్ భాగాలు ముక్కలు ముక్కలుగా అయిపోయాయి. ఒక బ్యాక్ సైడ్ పార్ట్ మాత్రమే కొంచెం కనిపిస్తోంది. మిగిలిన విమానం భాగం మంతా.. చిన్న చిన్న ముక్కులగా మాడి మాసై పోయాయి. ఇక ప్రయాణికులు అయితే గుర్తు పట్టలేనంతగా ఉన్నారు. శరీర భాగాలు చెల్లా చెదురయ్యాయి. ప్రమాదం జరిగిన స్థలమంతా భయంకరంగా మారింది. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

ALSO READ: Flight Crash Video: అహ్మదాబాద్ విమాన ఘటన.. ఇదిగో ఇలా కుప్పకూలింది.. వీడియో వైరల్

Advertisement

విమానం ఇంజిన్ భాగం కాలిపోయి.. తుక్కు తుక్కుగా మారిపోయింది. విమాన ప్రమాదం జరిగిన ప్రదేశమంతా బిల్డింగులు భారీగా దెబ్బతిన్నాయి. ఇళ్లన్నీ పూర్తిగా నల్లగా మారిపోయాయి. ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులకు కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. విమానంలో ఉన్న ప్రయాణికులు కాలు, మొండెం, చేతులు చెల్లా చెదురుగా దూరం దూరం పడిపోయాయి. దీంతో ఘటనా స్థలమంతా స్మశానాన్ని తలపిస్తోంది. ప్రమాదంలో ప్రాణ నష్టం భారీగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అధికారికంగా ఎంతమంది చనిపోయారు? అనేది తెలియదు.

ALSO READ: Flight Accident: గుజరాత్ ఫ్లైట్ ప్రమాదంలో.. మాజీ సీఎం విజయ్ రూపానీ.!

కానీ.. ఈ ప్రమాదంలో 100 మంది ప్రయాణికులు, 20 మంది డాక్లరు మృతిచెందినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 50కి పైగా మృతదేహాలను అహ్మదాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనా స్థలానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇప్పుడు ఈ హృదయ విదారక ఘటన దేశవ్యాప్తంగా పలువురిని కంటతడి పెట్టిస్తోంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×