BigTV English

Borewell Incident in Madhya Pradesh: విషాదం.. బోరు బావిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి

Borewell Incident in Madhya Pradesh: విషాదం.. బోరు బావిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి

Three Year old girl died in Bore Well(Today news paper telugu): దేశంలో మరో చిన్నారి బోరు బావికి బలైపోయింది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కాసర్‌ అనే గ్రామంలో తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లిన సౌమ్య అనే మూడేళ్ల చిన్నారి.. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.


250 అడుగుల లోతున్న బోరుబావిలో.. బాలిక 25 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు గుర్తించిన అధికారులు.. చిన్నారిని రక్షించేందుకు సహాయబృందాలను రంగంలోకి దించారు. పొక్లెయిన్లతో బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వి.. ఐదున్నర గంటల తర్వాత చిన్నారిని బయటికి తీయగలిగారు.

Also Read: జార్ఖండ్‌లో పట్టాలు తప్పిన హౌరా ఎక్స్‌ప్రెస్, 60 మందికి గాయాలు..


అప్పటికే సౌమ్య పరిస్థితి విషమంగా ఉండటంతో.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు బాలికకు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. కొన్ని గంటల తర్వాత ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పాప పుట్టిన రోజు నాడే ఈ ఘటన జరిగింది. కళ్ల ముందు ఆడుకుంటూ తిరిగిన చిన్నారి ఇక లేదని తెలిసి.. ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. అయితే గతేడాది బోరుబావి వేసినప్పటికి నీరు పడలేదు. ఆ తర్వాత బోరుబావిపై మట్టిని వేసి పూడ్చారు. కానీ వర్షాల కారణంగా మట్టి అంతా కిందకి దగిడంతో దాదాపు 25 వరకు గుంత ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.

 

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×