BigTV English

Raksha Khadse Daughter Assault: కేంద్ర మంత్రి కూతురిని వేధించిన పోకిరీలు.. మహారాష్ట్రలో కలకలం

Raksha Khadse Daughter Assault: కేంద్ర మంత్రి కూతురిని వేధించిన పోకిరీలు.. మహారాష్ట్రలో కలకలం

Union Minister Raksha Khadse Daughter Assault| మహారాష్ట్రలో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే (Raksha Khadse) ఆందోళన వ్యక్తం చేశారు. జల్గావ్ జిల్లాలోని ముక్తాయినగర్‌లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న తన కుమార్తెను కొందరు యువకులు వేధించారని ఆమె ఆరోపణలు చేశారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


మహాశివరాత్రి సందర్భంగా ముక్తాయినగర్‌లో జరిగిన సంత్ ముక్తాయ్ యాత్రలో తన కుమార్తె పాల్గొన్నదని, ఆ సమయంలో కొందరు యువకులు ఆమెను వెంబడించి వేధించారని రక్షా ఖడ్సే వివరించారు. భద్రతా సిబ్బంది అడ్డుకున్నప్పటికీ, ఆ యువకులు దురుసుగా ప్రవర్తించారని ఆయన తెలిపారు. “ఒక ఎంపీ లేదా కేంద్ర మంత్రి కుమార్తెకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాను,” అని రక్షా ఖడ్సే మీడియాకు తెలిపారు.

ఈ సంఘటనపై రక్షా ఖడ్సే మామ, మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే కూడా ఈ ఘటనపై స్పందించారు. “ఈ యువకులు కరుడుగట్టిన నేరస్థులు. వారిపై గతంలో కూడా పోలీసులకు ఫిర్యాదులు చేయబడ్డాయి. మహారాష్ట్రలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి, కానీ నేరస్థులు పోలీసులకు భయపడటం లేదు. బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు,” అని ఏక్నాథ్ ఖడ్సే విమర్శించారు.


Also Read:  మహిళలపై లైంగిక ఆరోపణలన్నీ నిజం కాదు.. తప్పుడు ఫిర్యాదులు చేస్తే చర్యలు తప్పవు

అంతేకాకుండా.. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసు కోవడంలో ఆలస్యం చేశారని మండిపడ్డారు. “పోలీస్ స్టేషన్‌కు వెళితే మమ్మల్ని రెండు గంటలపాటు కూర్చోబెట్టారు. అమ్మాయిల విషయం కాబట్టి పునరాలోచించుకోవాలని పోలీసులు సూచించారు. ఈ యువకులు పోలీసులపై కూడా దాడి చేసిన సందర్భాలు ఉన్నాయని తెలిసింది. వారికి రాజకీయ నాయకుల అండ ఉంది,” అని ఏక్నాథ్ ఖడ్సే ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. నిందితులు ఒక రాజకీయ పార్టీకి చెందినవారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్దన్ సప్కాల్ మహాయుతి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. “మహాయుతి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి,” అని ఆయన మండిపడ్డారు.

ఇటీవలే మహారాష్ట్రలోని పుణె నగరంలో పట్టపగలు పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోని ఓ బస్టాండులో ఓ యువతిపై అత్యాచారం జరిగింది.  నిందితుడు యువతిని మోసపూరితంగా ఒక ఖాళీ బస్సులోకి తీసుకెళ్లి ఆమెపై బలవంతం చేవాడు. అయితే ఆ తరువాత నిందితుడిని రెండు రోజుల్లో పోలీసులు గాలించి పట్టుకున్నారు. ఈ ఘటన తరువాత ఇప్పుడు ఏకంగా ఒక కేంద్ర మంత్రి కూతురిని ఆకతాయిలు లైంగికంగా వేధించారని ఆరోపణలు రావడంతో రాష్ట్రంలో పోలీస్ శాఖ, ప్రభుత్వాన్ని అందరూ తప్పుబుడుతున్నారు.

ఈ సంఘటనల కారణంగా రాష్ట్రంలో మహిళల భద్రత, శాంతిభద్రతల పరిస్థితిపై పలువురు ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Tags

Related News

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Big Stories

×