E-Paper
Advertisement

Manali : హిమాచల్‌ బాట పట్టిన పర్యాటకులు.. మనాలీ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌..

Manali : హిమాచల్‌ బాట పట్టిన పర్యాటకులు.. మనాలీ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌..
Advertisement

Manali : మంచు దుప్పటి కప్పుకున్న కొండలను.. మంచు కురిసే వేళల్లో చూడొద్దని ఎవరూ కోరుకోకుండా ఉంటారు చెప్పండి. కానీ అందరూ ఒకేసారి అలా కోరుకోవడమే ఇప్పుడు తలనొప్పిగా మారింది. క్రిస్‌మస్‌, ఇయర్‌ ఎండింగ్‌ కావడంతో అందరూ ఆఫీస్‌లకు సెలవులు పెట్టుకొని హిమాచల్‌ బాట పట్టారు.

దీంతో మనాలీ హైవే కార్లతో కిక్కిరిసిపోయింది. ఇటీవల భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న హిమాచల్‌కు పర్యాటకులు ఇలా పోటెత్తడం కలిసి వచ్చే అంశమే అయినా.. వారంతా ఇప్పుడు మనాలీ చేరుకునే సరికే వారు పెట్టుకున్న సెలవులు అయిపోయేలా ఉంది పరిస్థితి. కేవలం ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఏకంగా గంటన్నర సమయం పడుతుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూసుకోవచ్చు.

Advertisement

ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన అటల్‌ టన్నెల్‌ నుంచి నిన్న ఒక్కరోజే ఏకంగా 12 వేల వాహనాలు ప్రయాణించాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అటల్ టన్నెల్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం మైనస్‌ 12 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. పొగమంచు, వేల సంఖ్యలో పర్యాటకుల రాకతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలను క్లియర్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. అయితే పలు ప్రాంతాల్లో రోడ్డుపై మంచు పేరుకుపోవడంతో బైక్‌ల రాకపోకలను పోలీసులు అడ్డుకుంటున్నారు.

కసోల్, బంజర్స్‌ తీర్థన్‌ వ్యాలీ వంటి ప్రదేశాల్లో గత మూడు రోజుల్లో 55 వేల వాహనాలు రాకపోకలు సాగించాయి. న్యూఇయర్‌ వరకు ఇదే సీన్‌ కనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం మనాలీలో 90 శాతం హోటళ్లు బుక్ అయ్యాయనీ.. ఇప్పటికీ కూడా బుకింగ్స్‌ కొనసాగుతున్నాయని హోటల్ యజమానులు తెలిపారు.

Advertisement

ఒక్కసారిగా పర్యాటకుల తాకిడి భారీగా పెరగడంతో సిమ్లా పూర్తిగా సందడిగా మారింది. అక్కడి పార్కింగ్‌ ప్రాంతాలన్నీ పూర్తిగా నిండిపోవడంతో రోడ్లపైనే పార్కింగ్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కొత్త సంవత్సర వేడుకల కోసం ఈ వారంలో లక్షకు పైగా వాహనాలు సిమ్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్‌ సుఖు ట్విటర్‌ వేదికగా స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ వచ్చే పర్యాటకులకు ఆహ్వానం పలికారు.

Related News

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

Big Stories

Advertisement
×