Chennai: తమిళనాడులో విజయ్ ప్రభుత్వం కంటే.. త్రిష ఎక్కువగా హాట్ టాపిక్గా మారుతోంది. ప్రభుత్వానికి సంబంధించి ఏ ఈవెంట్ జరిగినా ఆమె హాజరవుతున్నారు. విజయ్ ప్రభుత్వం ఆమెకి ఆ విధంగా ప్రయార్టీ ఇస్తోంది. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకుల్లో కూడా అదే జరిగింది. అంతేకాదు వీఐపీలు కూర్చొనే తొలి వరసలో ఆమె సీటు ఏర్పాటు చేయడంపై తమిళనాడు వ్యాప్తంగా రకరకాల వార్తలు జోరందుకుంటున్నాయి.
సీఎం విజయ్-త్రిష గురించి ఇటీవలకాలంలో రకరకాల వార్తలు జోరందుకున్నాయి. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు నుంచి వీరిద్దరి మధ్య రకరకాల వార్తలు గుప్పుమంటున్నాయి. ఏదైనా గ్రాండ్ ఈవెంట్ జరిగితే దానికి నటి త్రిష కూడా హాజరుకావడం జరుగుతోంది. తాజాగా శనివారం తమిళనాడులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్లో జరిగిన కార్యక్రమానికి సీఎం విజయ్, ఆయన కుటుంబసభ్యులతోపాటు నటి త్రిష కూడా హాజరయ్యారు.
ముఖ్యమంత్రి విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముందు ఆమె మొదటి వరుసలో కూర్చున్నారు. దీనికి సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పసుపు రంగు చీర ధరించిన త్రిష, సీఎం విజయ్ రాక కోసం ఎదురుచూస్తున్న ఓ వీడియోలో కనిపించారు. మరో క్లిప్లో తల్లి ఉమాకృష్ణన్తో కలిసి వచ్చింది. సీఎం విజయ్ తల్లిదండ్రులు చంద్రశేఖర్- శోభా చంద్రశేఖర్ల పక్కన కూర్చుని కనిపించింది. సీఎం విజయ్ పరేడ్, జెండా ఆవిష్కరణ సమయంలో ఆమె సీటు నుంచి లేచి సెల్యూట్ చేసింది.
విజయ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇలాంటి ఘటన కనిపించింది. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కార్యక్రమానికి హాజరైన త్రిష ముందు వరుసలో కూర్చున్నారు. సీటులో కూర్చునే ముందు విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ను ఆప్యాయంగా కౌగిలించుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. కొన్నినెలలుగా విజయ్- త్రిషల రిలేషన్ షిప్ గురించి ఆన్లైన్లో తరచుగా ఊహాగానాలు వస్తున్నాయి. పుకార్లు కంటిన్యూ అవుతున్నప్పటికీ వీటిపై వాళ్లిద్దరు బహిరంగంగా స్పందించిన సందర్భం లేదు.
ALSO READ: రైల్వే జాబ్స్.. ఆర్ఆర్బి జూనియర్ ఇంజినీర్ 4,098 ఖాళీలు.. వెంటనే అప్లై చేసేయండి
గతంలో వీరిద్దరు అనేక సినిమాల్లో కలిసి నటించారు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మొదలైంది. అంతెందుకు.. తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ రోజు తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకుంది త్రిష. విజయ్ సన్నిహితురాలిగా నిత్యం వార్తల్లోకి వస్తోంది త్రిష. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో ఉదయానిధి అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆమె లభించిన గౌరవం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం, ఇస్తున్న ప్రాధాన్యతను అక్కడి రాజకీయ పార్టీలు రకరకాలుగా మాట్లాడుకోవడం కనిపిస్తోంది.
🚨 BREAKING: Actress Trisha attended the 80th Independence Day celebrations at Fort St. George, Chennai, where she was seated in the front row ahead of Chief Minister C. Joseph Vijay's National Flag hoisting ceremony. pic.twitter.com/TWKTN7SiEW
— Actor Vijay Team (@ActorVijayTeam) August 15, 2026
Trisha arrives 🙂 pic.twitter.com/XLtTRgWDR4
— KERALA VIJAY FANS CLUB (@KVFC_Official) August 15, 2026