E-Paper
Advertisement

AAP : ఆప్ అభ్యర్థి కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్.. బీజేపీపై కేజ్రీవాల్ ఆరోపణ..

AAP : ఆప్ అభ్యర్థి కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్.. బీజేపీపై కేజ్రీవాల్ ఆరోపణ..
Advertisement

AAP : గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్‌ జరివాలా కిడ్నాప్‌ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మంగళవారం మధ్యాహ్నం అదృశ్యమైన కంచన్‌.. బుధవారం రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వచ్చి తన నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. సూరత్‌ తూర్పు నియోజకవర్గం ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్‌ జరివాలా కన్పించట్లేదని బుధవారం ఉదయం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్ చేశారు. ఆప్ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకునేలా బీజేపీ ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. నామినేషన్‌ పత్రాల పరిశీలన కోసం కంచన్‌ మంగళవారం మధ్యాహ్నం రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి బయటకు వస్తుండగా కొందరు బీజేపీ నాయకులు ఆయనను బలవంతంగా తీసుకెళ్లారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఆరోపించారు. బీజేపీనే కిడ్నాప్‌ చేసి ఉంటుందని ఆప్‌ నేతలు మండిపడ్డారు.

కేజ్రీవాల్ ట్వీట్‌ చేసిన కొద్ది గంటలకే కంచన్‌ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. కంచన్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆప్‌, బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×