E-Paper
Advertisement

UP: పట్టించుకోని పిల్లలు.. కోట్లాస్థిని ప్రభుత్వానికి ఇచ్చేసిన వృద్ధుడు..

UP: పట్టించుకోని పిల్లలు.. కోట్లాస్థిని ప్రభుత్వానికి ఇచ్చేసిన వృద్ధుడు..

UP: వారసత్వంగా వచ్చిన ఆస్తులను తీసుకొని కొందరు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చుతుంటే.. మరికొందరు నడిరోడ్డుపైన పడేస్తున్నారు. భవిష్యత్తులో తమకూ అటువంటి రోజు వస్తుందని మర్చిపోతున్నారు. వృద్ధ వయస్సులో మనవండ్లు, మనవరాళ్లతో సంతోషంగా గడపాల్సిన వాళ్లు వృద్ధాశ్రమంలో రోడ్ల పక్కన బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అయితే వృద్ధాప్యంలో తనను పట్టించుకోని తన పిల్లలకు గట్టి గణపాఠం చెప్పాడు ఓ వృద్ధుడు. తన ఆస్తినంతా ప్రభుత్వానికి ఇచ్చేశాడు.

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌కు చెందిన నాథూ సింగ్(85)కు ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. పదేళ్ల క్రితం అతని భార్య చనిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగానే జీవిస్తున్నాడు. కొడుకు, కుమార్తెలు పట్టించుకోకపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉండలేక ఇటీవల ఓ వృద్ధాశ్రమానికి మారాడు. అయినా కూడా అతడిని చూడడానికి ఎవరూ రాలేదు. మనవళ్లు, మనవరాళ్లతో సంతోషంగా గడపాల్సిన సమయంలో వృద్ధాశ్రమంలో ఉండడం అతనికి ఏమాత్రం నచ్చలేదు.

ఈక్రమంలో వారికి బుద్ధి చెప్పాల్ని నిర్ణయించుకున్నాడు. తనకు ముజఫర్‌పూర్‌లో ఓ ఇంటితో పాటు రూ.1.5 కోట్ల ఆస్తి ఉంది. దానినంతా ప్రభుత్వం పేరిట వీలునామా రాశాడు. తాను చనిపోయాక తన స్థలంలో ప్రభుత్వాసుపత్రి లేదా స్కూల్‌ను నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరాడు. అలాగే తన శవాన్ని కొడుకు, కుమార్తెలు తాకడానికి కూడా వీలులేదని.. వైద్యకళాశాలకు తన మృతదేహాన్ని అప్పగించాలని వీలునామాలో పేర్కొన్నాడు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×