E-Paper
Advertisement

Modi : అమెరికాకు మోదీ పయనం.. టూర్ షెడ్యూల్ ఇదే..!

Modi :  అమెరికాకు మోదీ పయనం.. టూర్ షెడ్యూల్ ఇదే..!

Narendra Modi America Visit(Telugu breaking news today): ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. మంగళవారం భారత్ నుంచి బయలుదేరారు. బుధవారం నుంచి యూఎస్ లో మోదీ అధికారిక పర్యటన మొదలవుతుంది. యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌ తో వివిధ అంశాలపై చర్చలు జరుపుతారు. ముఖ్యంగా వాణిజ్యం ,పెట్టుబడులు, టెక్నాలజీ, టెలికాం, అంతరిక్షం, తయారీ రంగాలపైనా చర్చిస్తారు. విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి వినయ్‌ మోహన్‌ ఖ్వాత్రా ప్రధాని మోదీ అమెరికా పర్యటన వివరాలను వెల్లడించారు. రక్షణ రంగంలో పరస్పర సహకారం దిశగా భారత్‌, అమెరికాలు మరిన్ని ముందడుగులు వేయనున్నాయని తెలిపారు.

మోదీ అధికారిక పర్యటన జూన్ 21న న్యూయార్క్‌ నుంచి మొదలవుతుంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మోదీ పాల్గొంటారు. అక్కడ పలువురు ప్రముఖులను కలుస్తారు. అదే రోజు సాయంత్రం వాషింగ్టన్‌ చేరుకుంటారు. అక్కడ బైడెన్‌ దంపతులు ఇచ్చే విందులో పాల్గొంటారు. జూన్ 22న మోదీకి శ్వేతసౌధంలో బైడెన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. సాయంత్రం అధికారిక విందుకు మోదీ హాజరవుతారు.

అమెరికా ప్రభుత్వం ఇచ్చే అధికారిక విందుకు 400 మంది అతిథులు హాజరయ్యే అవకాశముందని సమాచారం. ఇందులో ఇండియన్‌ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు అమీ బెరా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్‌, రో ఖన్నా, శ్రీ థనేదార్‌ ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ సీఈవోలు సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌, ఫెడెక్స్‌ నుంచి రాజ్‌ సుబ్రమణియం విందుకు హాజరుకానున్నారు. జూన్ 23న కొందరు సీఈవోలతో భారత్ ప్రధాని భేటీ అవుతారు. ఆ తర్వాత అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ ఇచ్చే విందులో పాల్గొంటారు.

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ప్రవాస భారతీయులు వాషింగ్టన్‌ లింకన్‌ మెమోరియల్‌ వద్ద ర్యాలీ చేపట్టారు.మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. హ్యూస్టన్‌లోని సుగర్‌లాండ్‌ మెమోరియల్‌ పార్కు వద్ద భారతీయ పతాకాలు రెపరెపలాడాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్‌ గేట్‌ వంతెన, న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

అమెరికా పర్యటన తర్వాత ప్రధాని మోదీ జూన్ 24న ఈజిప్టు వెళతారు.రెండు రోజులపాటు ఆ దేశంలో పర్యటిస్తారు. 11వ శతాబ్దం నాటి అల్‌ హకీం మసీదును సందర్శించనున్నారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×