E-Paper
Advertisement

Sasikala: తమిళనాట కొత్త పార్టీ.. జయలలిత జయంతి రోజే చిన్నమ్మ సంచలన ప్రకటన!

Sasikala: తమిళనాట కొత్త పార్టీ.. జయలలిత జయంతి రోజే చిన్నమ్మ సంచలన ప్రకటన!

Sasikala: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే VK శశికళ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు సంచలన ప్ర‌క‌ట‌న చేశారు. రామనాథపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె ఈ మేరకు స్పష్టతనిచ్చారు. దివంగత త‌మిళ‌నాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జయంతిని పురస్కరించుకుని ఈ కీలక ప్రకటన చేయడం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. జయలలిత ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా శశికళ స్పష్టం చేశారు.

తమ నూతన పార్టీ అన్నాదురై.. ఎంజీఆర్.. జయలలిత వంటి మహోన్నత నాయకులు చూపిన బాటలోనే పయనిస్తుందని ఆమె వెల్లడించారు. పేదలు.. అణగారిన వర్గాలు.. సామాన్య ప్రజల అభ్యున్నతి కోసం తమ పార్టీ నిరంతరం శ్రమిస్తుందని హామీ ఇచ్చారు. అన్నాడీఎంకేలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆమె సొంత కుంపటి పెట్టాలని నిర్ణయించుకోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగానే భావిస్తున్నారు. జయలలిత వారసత్వాన్ని తానే కొనసాగిస్తానని ఆమె పరోక్షంగా ఈ సభ ద్వారా సంకేతాలు పంపారు.

శశికళ రాజకీయ ప్రవేశం తమిళనాడులోని ద్రవిడ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటు బ్యాంక్‌ను శశికళ పార్టీ ఏ మేరకు ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్ మద్దతును కూడగట్టుకునేందుకు ఆమె ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. జయలలిత స్నేహితురాలిగా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో తెర వెనుక చక్రం తిప్పిన శశికళ.. ఇప్పుడు నేరుగా ప్రజాక్షేత్రంలోకి రావడం ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఈ పరిణామం అటు అధికార డీఎంకేతో పాటు ఇటు అన్నాడీఎంకేను కూడా ఆలోచనలో పడేసిందని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Read Also: Chamala Kiran Kumar Reddy: చెప్పులు మోసిన వ్యక్తికి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదు: ఎంపీ చామల

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×