E-Paper
Advertisement

Wall Collapses In Madhya ‍Pradesh: పెను విషాదం..గోడ కూలి తొమ్మిది చిన్నారులు మృతి

Wall Collapses In Madhya ‍Pradesh: పెను విషాదం..గోడ కూలి తొమ్మిది చిన్నారులు మృతి
Advertisement

Wall Collapses In Madhya ‍Pradesh 9 Children Dead: మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సాగర్ జిల్లా షాజాపూర్‌లో ఆదివారం గోడ కూలడంతో తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనలో మరికొంతమందికి గాయలయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. శిథిలాలను పూర్తిగా తొలగించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాత గోడ కావడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని వెల్లడించారు.

Advertisement

సాగర్ జిల్లాలోని షాపూర్ ప్రాంతంలో ఆదివారం ఉదయం 8:30 గంటల సమయంలో గోడ కూలింది. గత కొన్నిరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓ దేవాలయం గోడ మెత్తబడింది. దీంతో ఒక్కసారిగా గోడ కూలి చిన్నారులపై పడింది. ఈ ఘటనలో 9మంది మృతి చెందగా..ఇద్దరు గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని సాగర్ జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య తెలిపారు.

కూలిన గోడ శిథిలాల కింద చిన్నారులు చిక్కుకొని దుర్మరణం చెందారు. ప్రస్తుతం స్థలంలో ఉన్న శిథిలాలను సైతం తొలగిస్తున్నట్లు సాగర్ జిల్లా కలెక్టర్ తెలిపారు.

Advertisement

Also Read: బస్సు – కారు ఢీ.. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వే పై ఘోరప్రమాదం

ఇదిలా ఉండగా, రేవా జిల్లాలో ఓ శిథిత భవనం గోడ కూలి నలుగురు విద్యార్థులు మృతి చెందగా.. ఓ మహిళతోపాటు ఓ చిన్నారి గాయపడ్డారు. స్కూల్ వెళ్లిన విద్యార్థులు ఇంటి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు రేవా పోలీస్ అధికారి మహేంద్ర సింగ్ సికర్వార్ తెలిపారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×