E-Paper
Advertisement

Delhi Crime News: ఢిల్లీలో దారుణం.. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త..

Delhi Crime News: ఢిల్లీలో దారుణం.. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త..
Advertisement
Delhi crime news
 

Woman burnt alive by husband in Delhi’s Rohini(Telugu breaking news today): దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. క్షణికావేశంలో ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో బాధితురాలి శరీరం పూర్తిగా కాలిపోయింది. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మంటల్లో కాలిన మహిళను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే.. సోమవారం ఓ ఇంట్లో మంటలు చెలరేగినట్లు, అక్కడ కొందరు మంటల్లో చిక్కుకున్నారని బేగంపూర్ పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూమ్ కి కాల్ వచ్చిందని డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ జిఎస్ సిద్దూ తెలిపారు. వెంటనే పోలీస్ బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించి విషయం తెలుసుకున్నారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం ప్రమాద స్థలిని పరిశీలించగా ఆ ఇంటి మెయిన్ డోర్ లోపలి నుంచి లాక్ వేసి ఉండటాన్ని గుర్తించారు. ఈలోగా అగ్నిమాపక సిబ్బంది ఘటానా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసారు.

Advertisement

Read more: భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో.. ప్రారంభించిన ప్రధాని మోదీ..

పోలీసులు ఆ ఇంట్లో తనిఖీ చేయగా తీవ్రంగా కాలిన ఒక మహిళ స్పృహ లేకుండా పడి ఉంది. ఆమెను వెంటనే ఆసుత్రికి తరలించగా ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని, ఇద్దరు కుమార్తెలను మరొక ఆసుపత్రిలో చేరారు. అయితే అక్కడి నుంచి మరొక PCR కాల్ వచ్చింది.

Advertisement

పోలీసు బృందం వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తి మృతురాలి భర్త అని తెలుసుకున్నారు. మృతురాలి కుమార్తెలలో ఒకరు అక్కడ జరిగిన విషయం పోలీసులకు తెలిపింది. మా నాన్న ఎప్పుడు తాగుతూ ఉండేవాడని తన తల్లితో తరుచూ గొడవపడుతుంటాడని ఈ నేపథ్యంలో తన తల్లితో గొడపడి కిరోసిన్ పోసి నిప్పంటించాడని పేర్కొంది. నిందుతుడిపై ఐపీసీ 302 సెక్షన్ క్రింద ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.

Related News

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

Big Stories

Advertisement
×