E-Paper
Advertisement

RSS Chief: ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో భేటీ కానున్న యోగి.. ‘గాలి బుడగ’ పై చర్చించే అవకాశం

RSS Chief: ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో భేటీ కానున్న యోగి.. ‘గాలి బుడగ’ పై చర్చించే అవకాశం

RSS Chief: జూన్ 15న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమావేశం కానున్నారు. వీరి మధ్య లోక్ సభ ఎన్నికల ఫలితాలు, యూపీలో ఆర్ఎస్ఎస్ విస్తరణతోపాటు పలు అంశాలపై చర్చ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడని, ఇతరులకు ఎలాంటి హానిని కలిగించకుండా పని చేసుకుంటూ ముందుకు వెళ్తాడని ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఈ భేటీ విషయమై చర్చ కొనసాగుతున్నది.

ఇటు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. 240 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అత్యంత కీలకమైన రాష్ట్రం యూపీలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. 80 స్థానాలకు గానూ 33 సీట్లను మాత్రమే సొంతం చేసుకుంది. 2019లో ఆ సంఖ్య 62గా ఉంది. ఇదే యూపీలో ఇండియా కూటమికి 43 సీట్లు వచ్చాయి. ఈ ఫలితాల తరువాత ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ లో ఒక వ్యాసం ప్రచురితమయ్యింది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ కార్యకర్తల అతి విశ్వాసాన్ని కళ్లకు కట్టాయని, వీరితోపాటు నేతలంతా ‘గాలి బుడగ’ను నమ్మకుని పని చేశారని, మోదీపైనే ఆధారపడ్డారని, వీధుల్లో ప్రజల గొంతుకలను వినలేదంటూ ఆ వ్యాసం పేర్కొన్న విషయం తెలిసిందే.

‘ప్రధాని మోదీ పిలుపునిచ్చిన 400కు పైగా సీట్లను కైవసం చేసుకుంటామనే లక్ష్యం తమది కాదని బీజేపీ నేతలు, కార్యకర్తలు భావించారు. మోదీ ఇమేజ్ తో గెలుస్తామనే నమ్మకంతో వారు పని చేయలేదు. స్థానిక నాయకులను తక్కువ చేసి చూడడం, పార్టీ ఫిరాయించిన వారికే టికెట్లు ఇవ్వడం, బాగా పనిచేసిన పార్లమెంటు సభ్యులకు టికెట్లు ఇవ్వకపోవడం వికటించింది. మహారాష్ట్రలో పార్టీలను చీల్చడం వంటి అనవసర రాజకీయాలు కూడా పార్టీని దెబ్బతీశాయి’ అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేసింది.

Also Read: ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే సీఎం సతీమణి రాజీనామా.. ఎందుకో తెలుసా?

ఇందుకు సంబంధించి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ‘ మొదటగా భక్తి చూపించి, ఆ తరువాత అహంకారం పెంచుకున్న పార్టీ 240 దగ్గర ఆగిపోయింది. రాముడిని వ్యతిరేకించినవారు 234 వద్ద మాత్రమే ఆగిపోయారు’ అంటూ ఆయన పేర్కొన్నారు.

Tags

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×