OTT Movie : హిస్టారికల్ సినిమాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చూసే కొద్ది చూడాలనిపించే ఈ స్టోరీలు ఓటీటీలో చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కథ కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది. స్వతంత్రం వచ్చే సమయంలో ఒక గ్రామంలో ఈ స్టోరీ రన్ అవుతుంది. ఒక తెల్ల దొర ఆరాచకాలతో ఈ స్టోరీ ఉత్కంఠంగా సాగుతుంది. హిస్టారికల్ ఫ్యాన్స్ ఈ సినిమాపై ఓ లుక్ వేయండి. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘ఆగస్ట్ 16, 1947’ అనే ఈ సినిమా 2023లో విడుదలైన తమిళ హిస్టారికల్ సినిమా. ఇది ఎన్.ఎస్. పోన్ కుమార్ డైరెక్ట్ చేసిన డెబ్యూ ఫిల్మ్. ఎ.ఆర్. మురుగదాస్, పర్పుల్ బుల్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఇది రూపొందింది. ఈ సినిమా 2023న ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదలైంది. 2 గంటల 20 నిమిషాల నిడివితో ఐయండిబిలో 6.7/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
ఇండియాకి 1947 ఆగస్ట్ 15న స్వతంత్రం వస్తుంది. కానీ దక్షిణ తమిళనాడులోని సెంగాడు అనే మారుమూల గ్రామానికి ఈ వార్తే రాదు. అక్కడ బ్రిటిష్ ఆఫీసర్ రాబర్ట్ తన కొడుకు జస్టిన్తో కలిసి క్రూరంగా పాలిస్తుంటాడు. గ్రామస్తుల్ని బానిసలుగా చూస్తూ ట్యాక్స్ వసూలు చేసి, మహిళలపై అఘాయిత్యాలు చేస్తూ ఉంటాడు. స్వతంత్రం వచ్చిన విషయాన్ని అక్కడి ప్రజలకు తెలీకుండా పోస్ట్మాన్ని బంధించి, రేడియో సిగ్నల్స్ కట్ చేసి ఇంకా బ్రిటిష్ పాలన ఉందని మోసం చేస్తాడు. ఆ గ్రామ యువకుడు పరమ్ ఎంట్రీతో కథ మారిపోతుంది. ఆ ఊరి జమిందారి కూతుర్ని అతను ప్రేమిస్తుంటాడు. అయితే ఆమెను చూసిన తెల్ల దొర, తనని ఇంటికి పంపమని జమిందారిని బెదరిస్తాడు.
Read Also : ప్రేమించకపోతే చంపేస్తుంది… ఆమె కంట్లో పడ్డ మగాడికి దబిడి దిబిడే
ఈ అన్యాయాలు చూసి తట్టుకోలేక పరమ్ తిరుగుబాటు చేస్తాడు. ఒకరోజు దూరంగా వెళ్లి రహస్యంగా రేడియోలో నెహ్రూ స్పీచ్ వింటాడు. ఇండియాకి స్వతంత్రం వచ్చిందని తెలుసుకుని షాకవుతాడు. ఆ వార్తను గ్రామస్తులకు చెప్పగానే అందరూ ఒక్కసారిగా మేలుకొని, కర్రలు, రాళ్లు, వ్యవసాయ పనిముట్లు తీసుకుని బ్రిటిష్ వాళ్లపై తిరుగుబాటు మొదలు పెడతారు. ఈ పోరులో చాలా మంది గ్రామస్తులు ప్రాణాలు కోల్పోతారు. పరమ్ కూడా తీవ్రంగా గాయపడతాడు కానీ గ్రామంలో తొలిసారిగా జెండా ఎగురవేస్తాడు. ఆగస్ట్ 16న సూర్యోదయంతో ఆ గ్రామం స్వతంత్రం అవుతుంది.