E-Paper
Advertisement

Crime Thriller Series OTT: పోలీస్ చేతిలో నలిగిపోయే మహిళ… ఒంట్లో వణుకు పుట్టించే రివేంజ్

Crime Thriller Series OTT: పోలీస్ చేతిలో నలిగిపోయే మహిళ… ఒంట్లో వణుకు పుట్టించే రివేంజ్
Advertisement

Crime Thriller Series OTT : ఇప్పుడు ఎక్కడ చూసినా థ్రిల్లర్ కంటెంట్ నే ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అయితే వీటిలో కూడా కొన్ని వెబ్ సిరీస్ లు ఘోరమైన రక్తపాతంతో నడుస్తున్నాయి. హింస కూడా ఎక్కువగా ఉండటంతో ఈ సిరీస్ లు పెద్దలకు మాత్రమే అన్నట్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక తెలుగు థ్రిల్లర్ సిరీస్, ఒళ్ళు జలదరించే కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ప్రతి ఎపిసోడ్ లో రక్తం ఏరులై పారుతుంది. మదనపల్లె నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్, ఒక తల్లి ఆమె ముగ్గురు పిల్లల చుట్టూ తిరుగుతుంది. ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్.

జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో స్ట్రీమింగ్

ఈ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘సైతాన్’ (Shaitan). ‘యాత్ర’, ‘ఆనందో బ్రహ్మ’ వంటి చిత్రాలను తెరకెక్కించిన మహి వి రాఘవ్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో 2023 జూన్ 15 నుంచి స్ట్రీమింగ్ లో ఉంది. ఇందులో రిషి (బాలి పాత్రలో), షెల్లీ కిషోర్ (సావిత్రి పాత్రలో), దేవయాని శర్మ (జయప్రద పాత్రలో), జాఫర్ సాదిక్ (గుమ్తి పాత్రలో), రవి కాలే (నాగిరెడ్డి పాత్రలో) నటించారు. ఇందులో మొత్తం 9 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇది అత్యంత హింసతో, బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ‘ఎ’ రేటెడ్ సిరీస్ కూడా.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మదనపల్లె దగ్గర ఒక ఊర్లో సావిత్రి అనే ఒక ఇల్లాలు ఉంటుంది. ఆమెకు మొగుడు లేకపోయినా, తన ముగ్గురు పిల్లల్ని (బాలి, గుమ్తి, జయప్రద) చాకడానికి పడరాని పాట్లు పడుతుంటుంది. కానీ ఆ ఊర్లో ఉండే ఒక కంత్రీ పోలీసోడు వీళ్ళని పీడిస్తూ ఉంటాడు. సావిత్రిని వాడుకుంటూ, కూతురు మీద కూడా కన్నేస్తాడు. వాడు పెట్టే నరకం చూడలేక, ఒకరోజు ఆ పోలీసోడిని సావిత్రి పెద్ద కొడుకు బాలి గొడ్డలితో నరికి పాతేస్తాడు. అక్కడి నుంచే వీళ్ళ అసలు వేట మొదలౌతుంది. పోలీసోడిని చంపేశాక బాలి అయితే వెనక్కి తగ్గడు. బతకాలంటే ఎదురు తిరగడమే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతాడు. వాడికి తోడుగా తమ్ముడు, చెల్లెలు కూడా తోడవుతారు. ఊర్లో ఉండే అరాచక శక్తులతో వీళ్లు యుద్ధం మొదలుపెడతారు.

దెబ్బకు దెబ్బ అన్నట్లు చంపుకుంటూ పోతుంటే, పోలీసులకి వీళ్లు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అయిపోతారు. ఆ క్రమంలోనే అడవిలో ఉండే నక్సలైట్లతో కలిసి గవర్నమెంట్ తోనే యుద్ధానికి దిగుతారు. కథ మొత్తం రక్తం ఏరులై పారుతుంది. బయటి ప్రపంచానికి వీళ్లు సైతాన్లలా కనిపిస్తారు కానీ, వాళ్ల దృష్టిలో అది కేవలం తమ ఫ్యామిలీని కాపాడుకోవడానికి చేసిన పోరాటం. ఎవరినీ నమ్మకుండా, ఎవడు ఎదురొచ్చినా నరుక్కుంటూ పోయే బాలి అండ్ గ్యాంగ్ ప్రయాణం ఎక్కడ ఆగిందో తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

Advertisement

Read Also : టీనేజ్ వయసులో ప్రేమ…10 ఏళ్ల తర్వాత షాకింగ్ ట్విస్టులు… లవర్స్ చూడాల్సిన స్టోరీ

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×