New Movies OTT : ఈ వారం ఓటీటీ ప్రియుల కోసం బోలెడంత వినోదం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్ సీజన్ 2’ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తుండగా, మరికొన్ని కొత్త సినిమాలు కూడా ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధం అయ్యాయి. థ్రిల్, సస్పెన్స్, క్రైమ్, ఎమోషన్… ఇలా ప్రతి జానర్ ప్రేక్షకుల కోసం మలయాళం నుంచి తెలుగు వరకు 4 కొత్త సినిమాలు ఈ ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చేశాయి. మరి ఆ సినిమాలు ఏంటి ? ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
మ్యూజికల్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ గా రూపొందింది “లుక్కే”. 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ కు హిమాంక్ గౌర్ దర్శకత్వం వహించగా, ఆప్టిమిస్టిక్స్ ఎంటర్టైన్మెంట్, వైట్ గొరిల్లా LLP బ్యానర్ల క్రింద విపుల్ డి. షా, రాజేష్ బహల్ సంయుక్తంగా నిర్మించారు. “లుక్కే” కథ చండీగఢ్లోని ర్యాప్ సంస్కృతి, స్ట్రీట్ ఫైట్ వంటి అంశాల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో “MC బద్నామ్” – “OG” అనే ఇద్దరు ర్యాపర్ ల మధ్య ఫైట్ జరుగుతుంది. వారి వైరం ప్రతీకారం, కలలు, జీవిత ప్రయాణాన్ని ఇంట్రెస్టింగ్ గా ఈ సిరీస్ లో చూపించారు. ఈ సిరీస్ ట్యాగ్లైన్ “ర్యాప్ అండ్ ప్రతీకారం, రెండూ గట్టివే”. దానికి తగ్గట్టే ఉంటుంది సిరీస్. మే 8 నుంచి ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి రానుంది.
మలయాళ కామెడీ-డ్రామా “వాజా II” గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుమారు 10 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 233 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. సమాజం నుండి వెలివేయబడిన నలుగురు స్నేహితులు హషీర్, అలన్, అజిన్, వినాయక్ ల చుట్టూనే ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. వాళ్ళు లైఫ్ లో ల సెట్ అయ్యారు అన్నది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ కూడా 8వ తేదీ నుంచి హాట్స్టార్ (JioHotstar)లో వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటించిన మూవీ ‘డెకాయిట్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా రాణించలేదు. 13 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి తప్పించుకున్న హరిదాస్, అతని ప్రేయసిపై ఎలా పగ తీర్చుకున్నాడు ? అనేదే కథ. తనపై తప్పుడు కేసు పెట్టిన తన మాజీ ప్రేయసి సరస్వతిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది స్టోరీ. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, జరీనా వహాబ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో మే 8న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది.
మలయాళ కామెడీ-థ్రిల్లర్ సీక్వెల్ గా రూపొందిన మూవీ “భరతనాట్యం 2: మోహినియాట్టం”. సైజు కురుప్, సూరజ్ వెంజరమూడు తదితరులు నటించిన ఈ సినిమా కూడా ఈరోజు నుంచే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. కుటుంబ పెద్ద భరతన్ నాయర్ చనిపోవడంతో, అతని రెండవ జీవితానికి సంబంధించిన రహస్యాలు బయట పడతాయి. అలాగే అనుకోకుండా జరిగిన ఒక నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించే శశి (సైజు కురుప్), అతని కుటుంబానికి ఏం జరిగింది ? అన్నదే కథ. మే 8 నుంచి నెట్ఫ్లిక్స్లో ఉంటుంది ఈ మూవీ.