OTT Movie : మలయాళ సినిమాలకు ఓటీటీలో యమ క్రేజ్ ఉంది. అందులోనూ థ్రిల్లర్లను వదిలి పెట్టకుండా చూస్తున్నారు ఆడియన్స్. ఇప్పుడు స్టార్ నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. థియేటర్లలో రిలీజైన 10 నెలల తర్వాత ఈ మూవీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పర్ ఏమిటి ? ఏ ఓటీటీలో వస్తుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
మమ్ముట్టి హీరోగా నటించిన ఈ మలయాళ థ్రిల్లర్ మూవీ పేరు ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’. ఈ సినిమా డిసెంబర్ 19 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 2025 జనవరి 23న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ 10 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుండటం విశేషం. ఇందులో మమ్ముట్టి, గోకుల్ సురేష్, సుష్మిత భట్ లీడ్ రోల్స్ లో నటించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మమ్ముట్టి సొంత బ్యానర్ లో నిర్మించారు.
Read Also : చాలా దేశాలలో నిషేధించిన మూవీ… ఇలాంటి సినిమాను జీవితంలో చూసి ఉండరు
డొమినిక్ అనే పోలీస్ ఆఫీసర్, కళ్లు రంగులు చూడలేని సమస్య వల్ల ఒక కేసులో తప్పు చేసి జాబ్ పోగొట్టుకున్నాడు. భార్య డివోర్స్ ఇచ్చేసింది. ఇప్పుడు ప్రైవేట్ డిటెక్టివ్గా ఒక అద్దె ఇంట్లో ఉంటాడు. అతని అసిస్టెంట్ విక్కీతో కలిసి చిన్న చిన్న కేసులు తీసుకుంటాడు. ఒక రోజు ఇంటి ఓనర్ కి హాస్పిటల్లో ఒక మహిళ పర్స్ దొరుకుతుంది. ఈ పర్స్ యజమానురాల్ని ఫైండ్ చేస్తే, రెంట్ మాఫ్ చేస్తా అని డొమినిక్ని అడుగుతుంది. డొమినిక్ మొదట సింపుల్ కేస్ అని అనుకుని మొదలెడతాడు. పర్స్లో ID కార్డ్, ఫోటోలు, క్యాష్, కీస్ ఉంటాయి. ID ప్రకారం పేరు పూజ అని, ఆమె మిస్సింగ్ అని తెలుస్తుంది. డొమినిక్ విక్కీతో కలిసి హాస్పిటల్ CCTV చూస్తాడు, నందిత ఫ్రెండ్స్ని క్వశ్చన్ చేస్తాడు.
ఈ ఇన్వెస్టిగేషన్ లో మరిన్ని షాకింగ్ ట్విస్ట్లు వస్తాయి. ఇది సింపుల్ కేస్ కాదు అని తెలుస్తుంది. ఇంకా ఎంక్వైరీ చేస్తుంటే పూజ బాయ్ ఫ్రెండ్ కార్తీక్ కూడా కనిపించడం లేదని తెలుస్తుంది. చివరకు పూజను హత్య చేసినట్లు తెలుస్తుంది. దీంతో డొమినిక్ షాక్ అవుతాడు. ఇక స్టోరీ మరింత ఉత్కంఠంగా నడుస్తుంది. చివరికి పూజను హత్య చేసింది ఎవరు? కార్తీక్ ఏమయ్యాడు? ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.