OTT Movie : ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలను చూడటానికి ఆసక్తిని చూపిస్తున్నారు ప్రేక్షకులు. అందులోనూ మలయాళం థ్రిల్లర్ సినిమాలను మిస్ కాకుండా చూస్తున్నారు. ఇప్పుడు చెప్పుకునే మలయాళం థ్రిల్లర్ రీసెంట్ గానే ఓటీటీలోకి వచ్చింది. ఇందులో ఒక యూట్యూబర్ జంట తమ పొరుగున ఉండే ఒక మిస్టీరియస్ మహిళ గురించి వీడియో తీస్తూ చిక్కుల్లో పడతారు. ఈ సినిమా ఇమ్మర్సివ్ ఫౌండ్-ఫుటేజ్ స్టైల్, థ్రిల్లింగ్ మూమెంట్స్తో ఆకట్టుకుంటోంది.దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
‘ఫుటేజ్’ (Footage)సైజు శ్రీధరన్ డైరెక్ట్ చేసిన మలయాళ ఫౌండ్-ఫుటేజ్ థ్రిల్లర్ సినిమా. ఇందులో మంజు వారియర్, విశాక్ నాయర్, గాయత్రి అశోక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 ఆగస్ట్ 23న మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇప్పుడు Amazon Prime Videoలో మలయాళం, హిందీ ఆడియోతో తెలుగు, ఇంగ్లీష్ సబ్టైటిల్స్ తో స్ట్రీమింగ్లో ఉంది. 2 గంటల 6 నిమిషాల రన్టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 4.9/10 రేటింగ్ ఉంది.
స్టోరీ ఏమిటంటే
కోవిడ్ లాక్డౌన్ సమయంలో, విశాక్, గాయత్రి అనే యూట్యూబర్ జంట తమ లైవ్-ఇన్ రిలేషన్లో జీవిస్తూ, వీడియో కంటెంట్ కోసం హాంటెడ్ ప్లేసెస్, పొరుగువాళ్లను షూట్ చేస్తుంటారు. వాళ్ల అపార్ట్మెంట్లో దిగువన ఉండే ఒక మిస్టీరియస్ మహిళ (మంజు వారియర్) వాళ్ల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ మహిళ రాత్రిపూట హాంటెడ్ ఫారెస్ట్లోకి వెళ్తుంటుంది. ఆమెకు మాటలు రావు, అయితే రాతలతో కమ్యూనికేట్ చేస్తుంటుంది. విశాక్, గాయత్రి ఆమెను ఫాలో చేసి, ఆమె అపార్ట్మెంట్లోకి సీక్రెట్ గా వెళ్లి ఆమె డైరీని చదువుతారు. డైరీలో ఆమె పోస్ట్పార్టమ్ డిప్రెషన్, సమాజం ఆమెను తప్పుగా అర్థం చేసుకున్న విషయాలు, ఆమె రివెంజ్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. వాళ్లు ఆమెను ఫారెస్ట్లో ఫాలో చేస్తూ, ఒక హాంటెడ్ హౌస్, రాత్రి వర్షం, ఏనుగుల దాడి, అండర్వాటర్ సీక్వెన్స్లో చిక్కుకుంటారు.
Read Also : హెయిర్ కట్ కోసం ఇదెక్కడి అరాచకం సామీ… మనసును కదిలించే కన్నడ మూవీ