E-Paper
Advertisement

Documentary film : అమ్మాయిపై ఒళ్లు గర్పొడిచే దారుణాలు… వివాదాలతో బ్యాన్ అయిన మూవీ

Documentary film : అమ్మాయిపై ఒళ్లు గర్పొడిచే దారుణాలు… వివాదాలతో బ్యాన్ అయిన మూవీ

Documentary film : 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ఆధారంగా రూపొందించిన సినిమా ‘ఇండియాస్ డాటర్’ (India’s Daughter). ఈ వివాదాస్పద డాక్యుమెంటరీ చిత్రంలో నిర్భయ తల్లిదండ్రుల ఇంటర్వ్యూలతో పాటు, ఆ ఘటనలో దోషిగా తేలిన ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూ కూడా ఉంది. ఆ ఇంటర్వ్యూలో దోషి తన తప్పును సమర్థించుకుంటూ మాట్లాడిన మాటలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయనే కారణంతో భారత ప్రభుత్వం 2015 మార్చిలో ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయకుండా నిషేధించడం కూడా జరిగింది.

ఎక్కడ చూడచ్చు

ఇండియాస్ డాటర్ లెస్లీ ఉడ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ డాక్యుమెంటరీ చిత్రం, బీబీసీలో ప్రసారమయింది. ఇది 2012లో ఢిల్లీలో జరిగిన జ్యోతి సింగ్ అనే 23 యేళ్ళ ఫిజియోథెరపీ విద్యార్థినిపై జరిగిన దారుణాల ఆధారంగా రూపొందింది. 2015 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ఎండీటీవీ, యూకేలో బీబీసీ ద్వారా ఈ చిత్రాన్ని ప్రదర్శించాలనుకున్నారు. మార్చి 1న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తీహార్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న ముద్దాయి ఇంటర్వ్యూ ఉందన్న విషయం తెలిసింది. వెంటనే ఈ విషయం మీడియాకు తెలిసి, దీనిపై ధుమారం రేగింది.

భారత ప్రభుత్వం ఈ సినిమా ప్రసారాన్ని కోర్టు ఆదేశాలతో నిలిపివేసింది. బీబీసీ కూడా ప్రసారం చేయబోమని ప్రకటించింది. కానీ యూకేలో 4 మార్చి న ఈ సినిమాను ప్రసారం చేసారు. ఆ తరువాత యూట్యూబ్ లో కూడా ఈ సినిమాను అప్ లోడ్ చేశారు. ఇది యూట్యూబ్ లో సెన్సేషన్ కూడా సృష్టించింది. అయితే భారత ప్రభుత్వం యూట్యూబ్ ను ఈ వీడియోను భారతదేశంలో బ్లాక్ చేయాల్సిందిగా ఆదేశించింది. యూట్యూబ్ ఆ ఆదేశాన్ని పాటిస్తూ వీడియోను తీసివేయడం కూడా జరిగిపోయింది. అయితే ఈ సినిమా ఇండియా లో అందుబాటులో లేదు. ప్రైమ్ వీడియోలో బయట దేశాలలో దీనిని స్ట్రీమ్ చెయ్యచ్చు

నలుగురు దోషులకు ఉరిశిక్ష

ప్రధాన దోషులైన ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్లకు కోర్టు మరణశిక్ష విధించింది. అనేక న్యాయపరమైన పోరాటాల తర్వాత, 2020 మార్చి 20వ తేదీన తెల్లవారుజామున 5:30 గంటలకు ఢిల్లీలోని తిహార్ జైలులో వీళ్ళను ఉరితీశారు. అయితే ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు రామ్ సింగ్, విచారణ జరుగుతుండగానే 2013 మార్చిలో తిహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. నేరం జరిగిన సమయంలో మైనర్‌గా ఉన్న నిందితుడికి జువైనల్ జస్టిస్ బోర్డు మూడేళ్ల జైలు శిక్ష మాత్రమే విధించింది. అతను తన శిక్షా కాలాన్ని పూర్తి చేసుకుని 2015 డిసెంబర్‌లో విడుదలయ్యాడు కూడా.

Read Also :  అమ్మాయిలకు నరకం చూపించే జైలు… ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితమే

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×