OTT Movie : కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా తరేజ నటించిన ‘కె ర్యాంప్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగు పెట్టేసింది. దీపావళి సందర్బంగా 2025న అక్టోబర్ 18న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా, పాజిటివ్ టాక్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. నెల రోజుల్లోనే ఓటీటీలోకి అడుగు పెట్టి డిజిటల్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. రొమాంటిక్, కామెడీ థీమ్స్ తో ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సరదాగా సాగిపోతుంది. ఈ సినిమా ఏ ఓటీటీలోకి వచ్చింది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే..
‘కె ర్యాంప్’ (K-Ramp) అనే ఈ సినిమాకి జైన్స్ నాని తొలి సారిగా దర్శకత్వం వహించారు. ఇందులో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్ వీకే, సాయి కుమార్, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజేష్ దండా, శివ బొమ్మక్ దీనిని నిర్మించారు. ఆహా వీడియోలో నవంబర్ 15 నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. 2 గంటల 20 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 8.1/10 రేటింగ్ పొందింది.
కృష్ణ (సాయి కుమార్) అనే ధనవంతుడైన వ్యాపారవేత్త కొడుకు కుమార్ (కిరణ్ అబ్బవరం). చిన్నతనంలో తల్లిని కోల్పోవడంతో, తండ్రి గారాబంతో పెరిగి, చదువు సంధ్యలను పక్కన పెట్టి, స్నేహితులతో కలిసి అల్లరిచిల్లరిగా తిరుగుతుంటాడు. అతనిని దారిలో పెట్టాలని భావించిన తండ్రి, ఒక పండితుడి సలహా మేరకు కేరళలోని ఒక కాలేజ్ లో చేర్పిస్తాడు. అక్కడకు వెళ్లిన కుమార్, తన మామతో కలిసి ఎప్పటిలాగే సరదాగా గడుపుతుంటాడు. ఇలా సాగుతున్న ఇతని ప్రయాణం అనుకోకుండా మలుపు తిరుగుతుంది. కుమార్ ని ఒక ప్రమాదం నుంచి కాపాడిన మెర్సీ జాయ్ (యుక్తి తరేజా) అనే యువతిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు.
Read Also : కమిషనర్ కూతురు హత్య… 5 రోజుల తరువాత బ్రతికొచ్చే అమ్మాయి… ఇంటెన్స్ తమిళ మిస్టరీ థ్రిల్లర్