OTT Movie : ఆడియన్స్ ని అలరించడానికి స్టార్ నటులతో రూపొందిన ఒక యాంథాలజీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇందులో బాసిల్ జోసెఫ్, సైజు కురుప్, సుహాసిని మణిరత్నం లాంటి నటులు నటించారు. అయితే ఈ సినిమా నేరుగా థియేటర్ల గడప తొక్కకుండా, నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. మూడు చిన్న కథలతో ఈ సినిమా ఒక్కో కొత్తదనాన్ని చూపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘మధురం జీవామృత బిందు’ (Madhuram Jeevamrutha Bindu)2025లో విడుదలైన మలయాళ యాంథాలజీ సినిమా. ఈ సినిమాకి అప్పు ఎన్ భట్టాతిరి, ప్రిన్స్ జాయ్, జెనిత్ కాచప్పిల్లి, షాంజు జైబా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో లాల్, దయ్యనా హమ్మద్, వఫా ఖతీజా, పుణ్య ఎలిజబెత్, వినయ్ ఫోర్ట్, బాసిల్ జోసెఫ్, జాఫర్ ఇడుక్కి, సైజు కురుప్, సుహాసిని మణిరత్నం కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2025 అక్టోబర్ 31న నుండి సైనా ప్లేలో అందుబాటులో ఉంటుంది. రాబోయే రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమ మాక్స్లలో కూడా ప్రసారం కానుంది.
Read Also : అమ్మాయిలను కిడ్నాప్ చేసి, వెర్రివేశాలేసే సైకో .. రాత్రయితే ఫ్యామిలీ అంటూ నరకం… ఆ పాడు పనులన్నీ ఒకే గదిలో
మొదటి కథ : బాసిల్ జోసెఫ్ అనే యంగ్ మ్యాన్ సినిమాలను చాలా ఇష్టపడతాడు. అతను ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. కానీ ఆ అమ్మాయికి సినిమాలంటే ఇష్టం ఉండదు. బాసిల్ ఆమెను కన్విన్స్ చేయడానికి సినిమా స్క్రీనింగ్లు, డేట్స్ కి ప్లాన్ చేస్తాడు. ఈ కథలో సినిమా ద్వారా ప్రేమ ఎలా పెరుగుతుందో చూపిస్తారు.
రెండో కథ : వినయ్ అనే వ్యక్తి అతని వైఫ్ (సుహాసిని మనిరత్నం)తో సంతోషంగా ఉంటాడు. అతనికి ఒక పెద్ద గోల్ ఉంటుంది. దానిని సాధించే క్రమంలో ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుంది. వినయ్ తన గోల్ ని రీచ్ అయ్యే క్రమంలో ఈ కథ ఉంటుంది.
మూడో కథ : మూడో కథలో లాల్ అనే వృద్ధుడితో మొదలవుతుంది. అతని గతంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటాడు. తన ప్రేమ కథను కూడా ఆసక్తికరంగా చెప్తాడు. ఈ స్టోరీ సంతోషం ఎలా మారుతుందో చూపిస్తుంది. ఈ అన్ని కథలు ఆడియన్స్ కి ఎమోషన్ గా కనెక్ట్ అవుతాయి.