OTT Movies : ఈ మధ్య సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా ఉంటున్నాయి. ఒక జానర్ ను మించి మరొక స్టోరీతో సినిమాలు వస్తున్నాయి. ఇటీవల హారర్ థ్రిల్లర్ సినిమాలతో పాటు ఎమోషనల్ సినిమాలో కూడా జనాలు బాగా కనెక్ట్ అవుతున్నారు. అలాంటి సినిమాలు ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంటున్నాయి. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలు కొన్ని ఏడిపిస్తే మరికొన్ని భయంతో వణికిస్తున్నాయి. ఇప్పటికీ ఆ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని చెప్పడంలో సందేహం లేదు. తాజాగా మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తుంది.. మరి ఆలస్యం ఎందుకు ఆ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..
మూవీ & ఓటీటీ..
తమిళ లెజండరీ డైరెక్టర్ భారతీ రాజా ప్రధాన పాత్ర పోషించిన ‘నిరమ్ మారుమ్ ఉలగిల్’ చిత్రం. ఈ ఏడాది మార్చి 7 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఎమోషనల్ డ్రామా మూవీకి బ్రిట్టో జేబీ దర్శకత్వం వహించారు. గుండెను బరువెక్కించేలా భావోద్వేగాలతో ఈ చిత్రం సాగుతుంది. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా అప్పట్లో మంచి టాక్ ని సొంతం చేసుకుంది.. మార్చి నెలలో రిలీజ్ అయినయి సినిమా ఇప్పుడు ఓటీడీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని ఈ శుక్రవారం ఏప్రిల్ 25వ తేదీన సన్నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ విషయాన్ని సన్నెక్స్ట్ ఇవాళ తన అధికారిక వెబ్ సైట్ ద్వారా పొందుపరిచారు.
Also Read : ప్రియుడ్ని పరిచయం చేసిన బ్రహ్మముడి అప్పు..ఇదేం ట్విస్ట్ మామా..
స్టోరీ విషయానికొస్తే..
ఈ మూవీ మొత్తం పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్స్ ను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.. గుండెను బరువెక్కించే సీన్లు ఇందులో ఉన్నాయి. తల్లిదండ్రులు చేసే త్యాగాలు, కుటుంబంలోని బంధాలు, భావోద్వేగాలు, అనుకోని పరిస్థితుల చుట్టూ నిరమ్ మారుమ్ ఉలగిల్ చిత్రం సాగుతుంది. ఈ సినిమాలో నాలుగు స్టోరీలు ఉంటాయి. అయితే ఇందులో ప్రతి స్టోరీలో ఎమోషనల్ టచ్ ఉంటుంది అభిమానులు ఎంతగానో ఈ సినిమాని ఆకట్టుకునేలా ఒక్కొక్క స్టోరీ ఒక్కో ఎమోషన్ తో ఉంటుంది. భారతీ రాజాతో పాటు రియోరాజ్, యోగిబాబు, నాటీ సుబ్రమణియం, సాండీ మాస్టర్, విజ్ఞేశ్ కాంత్, రాశికాంత్, కనిహ, వాడివుక్కరసి కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని డైరెక్టర్ బ్రిట్టో జేబీ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యింది. సిగ్నేచర్ ప్రొడక్షన్స్, జీఎస్ సినిమాస్ ఇంటర్నేషన్ బ్యానర్లు ప్రొడ్యూజ్ చేశాయి. దేవ్ ప్రకాశ్ రేగన్ మ్యూజిక్ ఇచ్చారు. ఈనెల 25న ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి…
తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో మూవీ ఒక్కో జోనర్ లో వస్తున్నాయి. ఓటీటీలో అయితే బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సమ్మర్ స్పెషల్ గా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి.