E-Paper
Advertisement

OTT Movie : వరుస యాక్సిడెంట్స్… అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ మర్డర్ మిస్టరీ

OTT Movie : వరుస యాక్సిడెంట్స్… అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ మర్డర్ మిస్టరీ
Advertisement

OTT Movie : కొత్త కొత్త మర్డర్ మిస్టరీ మూవీస్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఈ సినిమాలో జరిగే వరస మర్డర్స్ ను ఇన్వెస్టిగేట్ చేసే విధానం ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఈ మూవీ ఏ ఓటీ టిలో అందుబాటులో ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

నెలలోపే ఓటీటీలోకి…

Advertisement

యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన ఈ మలయాళం హిస్టరీ థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మూవీకి కన్నన్ దర్శకత్వం వహించగా, నిక్కీ గల్రాని, ఆశా శరత్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా తమిళ, మలయాళ భాషల్లో ఇప్పటికే రిలీజ్ అయింది. తమిళంలో ‘విరిందు’ అనే టైటిల్ తో థియేటర్లలోకి రాగా, మలయాళంలో మాత్రం ‘విరున్ను’ అనే టైటిల్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. కానీ స్క్రీన్ ప్లే పెద్దగా ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో సినిమా ఆడలేదు. కానీ థియేటర్లలో ఇలా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఓటిటిలో అదరగొట్టడం మనం ఇప్పటికే చాలాసార్లు చూసాం. ఈ మూవీ సంగతి ఎలా ఉంటుందో తెలియదు గానీ అక్టోబర్ 4 నుంచి సింప్లీ సౌత్ అనే ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోంది. కానీ సింప్లీ సౌత్ అనేది ఇండియన్ ఆడియన్స్ కు అందుబాటులో లేదు. ఓవర్సీస్ ఆడియన్స్ మాత్రమే ఇందులో సినిమాను చూడగలరు. ఇక ఇండియన్ ఆడియన్స్ కోసం ఈ మూవీ మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో అక్టోబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఓటీటీలోకి అయితే ఇంత ఫాస్ట్ గా వచ్చేసింది గానీ, థియేటర్లలోకి రావడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. 2021 లోనే ‘వీరున్ను’ అనే ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల మూవీ రిలీజ్ వాయిదా పడి ఏకంగా మూడేళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చింది. కాబట్టి ప్రేక్షకులకు ఈ మూవీ ఔటేటెడ్ స్టోరీ అని అనిపించి ఉండవచ్చు.

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

సినిమాలో జాన్, ఎలిజిబెత్ అనే ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. వాళ్లకి పెర్లీ అనే అమ్మాయి ఉంటుంది. ఈ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులే. జాన్ ఒకరోజు ఆఫీస్ కి వెళ్లి వస్తూ చనిపోతాడు. అతని మరణం అనుమానాస్పదంగా మారుతుంది. తండ్రి చనిపోయాడు అన్న వార్తను జీర్ణించుకోక ముందే తల్లి ఎలిజిబెత్ కూడా ఒక రోజు యాక్సిడెంట్లో కన్నుమూస్తుంది. దీంతో తల్లిదండ్రుల మరణానికి ఇంకా ఏదో కారణం ఉందనే అనుమానం కలుగుతుంది పెర్లీకి. ఈ కేసును నారాయణన్ అనే పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. మరి ఈ ఇద్దరు భార్యాభర్తల హత్యల వెనుకున్న మిస్టరీ ఏంటి? ఎందుకు హత్య చేశారు? నారాయణన్ ఒక్కడే ఈ కేస్ ని సాల్వ్ చేయగలిగాడా,? ఇన్వెస్టిగేషన్లో పెర్లి పాత్ర ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. మూడేళ్ల తర్వాత అర్జున్ నటించిన మలయాళ సినిమా ఇది.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×