New Series OTT : తాజాగా ఓటీటీలోకి ఏకంగా 3 క్రైమ్ థ్రిల్లర్స్ అడుగు పెట్టాయి. అవి కూడా తెలుగులో అందుబాటులో ఉండడం అన్నది మరో గుడ్ న్యూస్. మరి తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైన ఆ 3 సిరీస్ లు ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
హిందీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘సత్రంగి బద్లే కా ఖేల్’. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో ఉత్తరప్రదేశ్, బిహార్ గ్రామీణ నేపధ్యంలో సాగుతుంది. అక్కడ శతాబ్దాలుగా మగవారు ఆడవారి వేషం వేసి డ్యాన్స్ చేసే సాంప్రదాయక కళ ‘లౌండా నాచ్’ ఇందులో కీలకంగా ఉంటుంది. బబ్లూ మహ అనే యువకుడి తండ్రి ఈ డ్యాన్స్ చేస్తాడు. ఆ ఊరిలోని అగ్రవర్ణానికి చెందిన వాళ్ళు బబ్లూ తండ్రిని దారుణంగా చంపేస్తారు. దీంతో బాగా చదివి గొప్ప పొజిషన్ లో ఉండాలని కోరుకున్న బబ్లూ ఈ ఘటనతో ప్రతీకారం తీర్చుకోవాలని తీసుకున్న నిర్ణయం ఎక్కడికి దారి తీస్తుంది అన్నది కథ.
తమిళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘వారెంట్ ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ విలంగు. 2022లో వచ్చిన ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘విలంగు’ (Vilangu) సిరీస్ కు సీక్వెల్ గా రూపొందిన ఈ సిరీస్ కోట్టై కరుప్పుసామి (ప్రశాంత్ పాండియరాజ్) అనే అమాయకపు కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. తోటి పోలీసులతో పాటు, పై అధికారులు అతన్ని ప్రతిరోజూ కనీస గౌరవం లేకుండా అవమానిస్తారు, హింసిస్తారు. దీంతో ఓపిక నశించిన హీరో క్రూరంగా మారతాడు. పెండింగ్లో ఉన్న పాత వారెంట్ కేసులను విచారిస్తూ అతనిలోని క్రూరత్వాన్ని బయట పెడతాడు. అతని ధోరణి పోలీస్ స్టేషన్లో ఒక లాకప్ డెత్ కు దారితీస్తుంది. విఘ్నేష్ నటరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పోలీస్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా 8 ఎపిసోడ్లు ఉంటుంది.
Also Read : యుద్ధం అంటేనే భయం పుట్టించే సినిమాలు… వీటిని చూశాక మాటలు ఉండవు
కన్నడ మలయాళ బైలింగువల్ సినిమా ‘శేష’. 2016లో వచ్చిన ఈ మూవీ తాజాగా Sun NXT ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ప్రదీప్ అరసికెరె దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒకే రాత్రిలో జరిగే ఉత్కంఠభరితమైన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంది. 2016లో కర్ణాటక-కేరళ సరిహద్దు ప్రాంతంలో కథ సాగుతుంది. డిప్యూటీ సూపరింటెండెంట్ (దేవరాజ్), ఏఎస్ఐ ఆంథోనీ (ప్రమోద్ శెట్టి), ఎస్ఐ దాస్ (జాన్ కైప్పల్లిల్)ల మధ్య జరిగే గొడవలతో ఒక రాత్రి మొత్తం నరకంలా మారుతుంది. ఒకరి నుంచి ఒకరు ప్రాణాలు కాపాడుకుని బయట పడడానికి చేసే ప్రయత్నాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి.