Retro Movie OTT : తమిళ స్టార్ హీరో సూర్య, హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం రెట్రో.. మే డే సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ తమిళ్లో మాత్రం భారీ విషయాన్ని సొంతం చేసుకుంది. తమిళనాట మంచి క్రేజ్ ను అందుకుంది. అంతేకాదు కలెక్షన్స్ కు భారీగా వచ్చాయి. అయితే తెలుగులో మాత్రం పెద్దగా ఈ సినిమా ఆకట్టుకోలేదు. ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు మేకర్స్ ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఈ మూవీ ఓటీటీ హక్కులను ఏ సంస్థ సొంతం చేసుకుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ఓటీటీ డీటెయిల్స్..
రెట్రో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను జూన్ తొలి వారంలో స్ట్రీమింగ్కు తీసుకురావాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.. ఈ మూవీని ముందుగా జనవరి మొదటి వారం లో స్ట్రీమింగ్ కు తీసుకురావాలని నెట్ ఫ్లిక్స్ అనుకుంది. కానీ సినిమా తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో మే చివరి వారంలోనే ఓటీటీ లోకి తీసుకురానున్నట్లు ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
Also Read:సక్సెస్ఫుల్ మూవీకి సీక్వెల్… షూటింగ్ స్టార్ట్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
రెట్రో మూవీ స్టోరీ..
హీరో సూర్య గత ఏడాది నటించిన కొంగువా సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయింది. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బోల్తా కొట్టడంతో ఆయన అభిమానులు నిరాశ పడ్డారు. అయితే రెట్రో విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకొని సూర్య ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా తమిళ్లో అయితే మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. హీరోయిన్ గా పూజా హెగ్డే ఈ మూవీలో మేకప్ లేకుండా డీగ్లామరస్ లుక్లో పూజా కనిపించారు. గడ్డం తో సూర్య గెటప్ కూడా మూసీగా ఉంది. 1990ల బ్యాక్డ్రాప్ లో రొమాంటిక్ యాక్షన్ మూవీగా రెట్రో ను తెరకెక్కించారు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. లవ్ స్టోరీ, గ్యాంగ్స్టర్ల వార్ గా ఈ మూవీ స్టోరీ సాగుతుంది. జోజూ జార్జ్, జయరాం, నాజర్, ప్రకాశ్ రాజ్, కరుణాకరన్, స్వసిక కూడా కీలకపాత్రలు పోషించారు.. ఇక రెట్రో చిత్రం సుమారు రూ.70కోట్ల బడ్జెట్తో రూపొందింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటిందని మూవీ టీమ్ ప్రకటించింది..ఈ మూవీని 2డీ ఎంటర్టైన్మెంట్స్, స్టోన్బీచ్ ఫిల్మ్స్ బ్యానర్ల పై సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ కలిసి సంయుక్తంగా నిర్మించారు..
సూర్య సినిమాల కు క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య మాత్రం ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి. అందుకే ఇకమీదట చేసే సినిమాల విషయంలో సూర్య తగు జాగ్రత్తలు తీసుకొని కథలను ఎంపిక చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది.