OTT Movie : దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన సిద్ధు జోన్నలగడ్డ ‘తెలుసు కదా’ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రాశీ ఖన్నా భార్యగా, శ్రీనిధి షెట్టి ఎక్స్ గర్ల్ఫ్రెండ్గా, ట్రయాంగిల్ స్టోరీ నడపిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. ఇద్దరి మధ్యలో సిద్ధు ఇరుక్కుపోయే లవ్ ట్రయాంగిల్ ను అందరూ బింజ్ వాచ్ చేస్తున్నారు. ‘డిజే టిల్లు’తో సిద్ధుకి స్టార్ డమ్ అమాంతం పెరిగింది. అయితే కామెడీ రొమాంటిక్ సినిమాలతోనే ఆడియన్స్ ని పలకరిస్తున్నాడు సిద్ధు. ఇతని కామెడీ టైమింగ్ కూడా ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. ఇప్పుడు ‘తెలుసు కదా’ లో ఇద్దరు భామలతో రొమాన్స్ చేస్తూ, ఒక ఎమోషనల్ కంటెంట్ ని పరిచయం చేశాడు. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
నీరజ కోన దర్శకత్వంలో వచ్చిన ఈ ‘తెలుసు కదా’ తెలుగు రొమాంటిక్ సినిమాను టి. జి. విశ్వ ప్రసాద్ వివేక్ కుచిభోట్ల నిర్మించారు . ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించారు. దీనికి తమన్ సంగీతం సమకూర్చాడు. ఇది 2025 అక్టోబర్ 17 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
అనాథగా పెరిగిన వరుణ్ కి చిన్నప్పటి నుంచి ఒక మంచి ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటాడు. కాలేజ్ లైఫ్ లో రాగ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ ప్రేమ బ్రేకప్ అయిపోయి, ఒక్కోళ్లు ఒక్కో మార్గంలో వెళ్లిపోతారు. ఈ విషయంలో వరుణ్ చాలా బాధపడతాడు. కొంతకాలం తారువాత దీని నుంచి బయటపడి, అంజలి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. లైఫ్ సెటిల్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఇంతలోనే అంజలికి పిల్లలు పుట్టే అవకాశం తక్కువ అని తెలుస్తుంది. దీంతో ఈ జంట ఒక్క సారిగా షాక్ అవుతారు. ఈ జంట ఈ విషయంలో బాధపడుతున్న వేళ స్టోరీ ఊహించని మలుపు తీసుకుంటుంది.
Read Also : వర్షాకాలంలో మాత్రమే మొగుడి దగ్గరకు వచ్చే భార్య… కేక పెట్టించే కొరియన్ డ్రామా