E-Paper
Advertisement

OTT Movie : గోల్డ్ స్మగ్లింగ్ కోసం పుష్పను మించిన ప్లాన్… ఈ మలయాళ థ్రిల్లర్ లో ఒక్కో ట్విస్టుకు బుర్ర బద్దలే

OTT Movie : గోల్డ్ స్మగ్లింగ్ కోసం పుష్పను మించిన ప్లాన్… ఈ మలయాళ థ్రిల్లర్ లో ఒక్కో ట్విస్టుకు బుర్ర బద్దలే
Advertisement

OTT Movie : మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుంటున్నాయి. ఈ సినిమాలకు ఇప్పుడు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా గోల్డ్ స్మగ్లింగ్ తో మొదలౌతుంది. ఆ తరువాత ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. చివరిదాకా సస్పెన్స్ తో ఉత్కంఠంగా సాగుతుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే

స్టోరీలోకి వెళితే

Advertisement

ముత్తు, కన్నన్ అనే ఇద్దరు వ్యక్తులు త్రిస్సూర్‌ లో బంగారు వ్యాపారం చేస్తుంటారు. వీళ్ళు బంగారు ఆభరణాలను తయారు చేసి, దేశవ్యాప్తంగా జ్యువెలరీ షాపులకు సరఫరా చేస్తుంటారు. ముత్తు బంగారు ఆభరణాలు తయ్యారు చేస్తుంటే, కన్నన్ వాటిని ముంబై వంటి నగరాలకు రవాణా చేస్తుంటాడు. వీళ్ళ వ్యాపారం కొంత లొసుగులతో కూడి వుంటుంది. అయితే ఇది అనుకోని సమస్యలను తెచ్చిపెడుతుంది. ఒక రోజు కన్నన్, ముత్తు మరొక స్నేహితుడితో కలిసి కోయంబత్తూర్‌కు బంగారు డెలివరీ కోసం వెళతారు. అక్కడ పనయ్యాక, కన్నన్ ముంబైకి ఒంటరిగా ప్రయాణిస్తాడు. కానీ అతను అకస్మాత్తుగా కనిపించకుండా పోతాడు. తరువాత అతను ఒక హోటల్ గదిలో చనిపోయి కనిపిస్తాడు. గదిలో తాళం బయట నుండి వేసి ఉంటుంది. గదిలో రక్తం చెల్లా చెదురుగా ఉండటం, కన్నన్ శరీరంపై గాయాలు ఉండటం వల్ల అతను హత్య చేయబడినట్లు పోస్ట్‌మార్టం నివేదిక తెలియజేస్తుంది.

అతనితో ఉన్న 8 కిలోల బంగారం కూడా కనిపించకుండా పోతుంది. ఈ కేసును ముంబై పోలీసు అధికారి జయంత్ సఖల్కర్ (గిరీష్ కులకర్ణి) దర్యాప్తు చేస్తాడు. ముత్తు అతని సహచరులు కన్నన్ మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి పోలీసులతో కలిసి పనిచేస్తారు. దర్యాప్తు కేరళ, తమిళనాడు, ముంబైకి విస్తరిస్తుంది. చివరికి కన్నన్ ను చంపింది ఎవరు ? బంగారం ఎక్కడ దాచారు ? ముత్తు ఎలాంటి పరిణామాలు ఎదుర్కుంటాడు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : గజగజ ఓణికిపోయే హారర్ మూవీ.. సినిమా చూస్తూనే మరణం.. దైర్యం ఉంటేనే చూడాలి!

 

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘తంకం’ (Thankam). 2023 లో విడుదలైన ఈ సినిమాకి సైహీద్ అరాఫత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ త్రిస్సూర్‌లోని బంగారు వ్యాపారంలో జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఇందులో ప్రధాన పాత్రల్లో బిజు మీనన్ (ముత్తు), వినీత్ శ్రీనివాసన్ (కన్నన్), అపర్ణ బాలమురళి, గిరీష్ కులకర్ణి నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×