Cheekatilo OTT : టాలీవుడ్ స్టార్ నాగ చైతన్య భార్య, నటి శోభిత ధూళిపాళ పెళ్ళయిన తరువాత ఫస్ట్ టైమ్ ఓ కొత్త మూవీతో ప్రేక్షకులను అలరించబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ తో శోభిత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. కాకపోతే ఈ మూవీని డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో, ఎప్పుడు విడుదల కాబోతోంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
‘చీకటిలో’ (Cheekatilo) అనే కొత్త ప్రాజెక్ట్ తో శోభిత తిరిగి తెరపై మెరవబోతున్నారు. ఈ సినిమాను చాలారోజుల క్రితమే ప్రకటించారు. 2026 జనవరి 23న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ క్రైమ్ సస్పెన్స్ డ్రామా ప్రత్యేకంగా తెలుగు, హిందీ, తమిళ భాషలలో ప్రీమియర్ కానుంది. అంతేకాదు ఈ చిత్రం భారతదేశంతో సహ 240 కి పైగా దేశాలు, ప్రాంతాలలో ప్రైమ్ వీడియోలో ఏకకాలంలో ప్రసారం కానుంది. మూవీ రిలీజ్ డేట్ తో పాటు మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా ఆవిష్కరించారు. విశ్వదేవ్ రాచకొండ ఇందులో కథానాయకుడిగా నటిస్తుండగా… చైతన్య విశాలాక్షి, ఇషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ చిత్రనిర్మాత సురేష్ బాబు ఈ మూవీని నిర్మించారు. శరణ్ కోపిశెట్టి దర్శకత్వం వహించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. శోభిత చివరి సారిగా ‘లవ్ సితార’లో కన్పించింది. ఇప్పుడు ఆమె నెక్స్ట్ మూవీ ‘చీకటిలో’ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ కానుంది.
Read Also : యుద్ధం నుంచి బయటపడి దెయ్యం చేతిలో బుక్కయ్యే అమాయకుడు… భయపెడుతూనే నవ్వించే హర్రర్ మూవీ
హైదరాబాద్ లోని చీకటి వీధుల్లో జరిగే స్టోరీ ఇది. సంధ్య అనే నిజమైన క్రైమ్ పాడ్కాస్టర్ చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. నిజమైన సంఘటనల ఆధారంగా క్రైమ్ కథలను ప్రజలకు అందించడమే సంధ్య పని. ఈ నేపథ్యంలోనే ఆమె దగ్గర పని చేసే ఇంటర్న్ అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది. మొదట్లో విషాదకరమైన సంఘటనతో సంధ్య బాధ పడుతుంది. కానీ నెమ్మదిగా దాని నుంచి బయట పడి, నిజం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటుంది. ఇంటర్న్ మరణం గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక… అది ప్రమాదం కాదని, క్రైమ్ చైన్ అని తెలుసుకుంటుంది. ఆమె బయట పెట్టాలకునుకునే ఈ క్రైమ్ నెట్ వర్క్ వల్లే సంధ్య డేంజర్ లో పడుతుంది. ఆ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకుంది ? అసలు ఆ ఇంటర్న్ ఎలా చనిపోయింది ? అన్నది కథ. ఈ చిత్రంలో పాడ్కాస్ట్ల వంటి ఆధునిక అంశాలు ఉండడంతో మూవీ యూత్ ను ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉంది. మరి ఓటీటీలోకి వచ్చాక దీనికి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.