తనకు ఒక్క ఛాన్సిచ్చి చూడాలని కవిత తెలంగాణ ప్రజలను అప్పీలు చేసుకుంటున్నారు. ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండి.. కచ్చితంగా మార్పు తెచ్చి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆమె. సింగరేణి బొగ్గుబాయి పర్యటనలో ఉన్న ఆమె కీలక వ్యాఖ్యలు చేశారిలా! రామగుండం ఓసీపీ -3, బేస్ వర్క్ షాప్ లను సందర్శించి, కార్మికులతో ఆమె మాట్లాడారు. ప్రశ్నించినందుకు తనను పార్టీలోంచి తీసేశారని, ప్రజా సేవ చేయాలనే నా ఆలోచనలను, అకుంఠిత దీక్షను ఎవరూ తుడిచేయలేన్న ఆమె.. అందుకే కొత్త పార్టీ పెట్టానన్నారు.
మీ అందరికీ తెలుసు నన్ను బీఆర్ఎస్ ను బయటకు పంపితే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టాను… నాకు ప్రాణప్రదమైన సింగరేణి కార్మికులను కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాను…బాయిబాట కార్యక్రమం ద్వారా కార్మికులను కలిసి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను…అని అన్నారామె. మీకు నేను 20 ఏళ్లుగా తెలుసు. ఉద్యమంలోనూ అదే విధంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనూ మీతే పాటు పనిచేశాను…నేను ఎప్పుడూ కూడా కార్మికుల పక్షానే ఉన్నాను. కానీ గుంటనక్క కాంట్రాక్టర్ల పక్షాన ఉంది.. అని పరోక్షంగా హరీశ్పై ధ్వజమెత్తారు.
ఎప్పుడూ కూడా నేను కార్మికుల కోసమే పనిచేస్తాను.. నేను ఎంత మొండి దాన్నో మీకు తెలుసు…బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి ఏ ప్రతిపక్షం చేయనన్ని పోరాటాలు మేము చేస్తున్నాం…అవి కార్మికులకు వివరించారామె. యూనియన్లు, ప్రతిపక్షాలు ప్రశ్నించి వదిలేస్తాయి…కానీ మేము ప్రశ్నించు, పోరాడు, పరిష్కరించు అనే విధానంతో వెళ్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో సమస్యలను ఈ విధంగా పరిష్కరించామన్నారు. తమ పార్టీ పాంచజన్యం అనే ఐదు కీలక అంశాలతో ముందుకు వెళ్తోందని, ఉచిత విద్య, వైద్యం, సామాజిక న్యాయం, రైతుకు గౌరవం, యువత ఉపాధి, రుణాలు ఇవ్వాలనే సంకల్పం పెట్టుకున్నామన్నారు.
కచ్చితంగా మాకు అవకాశం ఇస్తే మంచి మార్పు తెస్తామన్న ఆమె.. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మార్పు మాత్రం కాదు. ప్రజల కోసం మంచి మార్పు కచ్చితంగా తెస్తామన్నారు. బీఆరెస్ పాలనలో జరిగిన పొరపాట్లకు తాను క్షమాపణ చెబుతున్నానన్నారు కవిత.