MP Chamala: స్వేచ్ఛ బ్యూరో: కేసీఆర్ పై ఎంపీ చామల సంచలన వ్యాక్యలు చేశారు. కేసీఆర్కు ఫామ్ హౌస్ పరిపాలన మాత్రమే తెలుసని అన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియదని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఇకనుంచి వర్దంతులు నిర్వహించుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. కే సీ ఆర్ కు ఫామ్హౌస్ పరిపాలన మాత్రమే తెలుసునని వెల్లడించారు. ఆయన కూతురు వ్యాఖ్యలపై కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదన్నారు.
Also Read: సిల్వర్ జూబ్లీ ఇయర్లో బీఆర్ఎస్.. నాటి నుండి నేటి వరకు ముందున్న లక్ష్యం అదే..?
మౌనం అంగీకారమే నా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ జేబులు చూసి పరిపాలించారనీ కవిత స్పష్టంగా చెప్పారని అన్నారు. ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదని లోక్ సభలో కేసీఆర్ అంటున్నారనీ, కానీ పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్ఎస్ బిజెపికి అవయవదానం చేసిందన్నారు. బిజెపి ఎంపీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారన్నారు. రెండున్నర సంవత్సరాలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో? కేసీఆర్ కు సంబంధం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చెయ్యాలని ముందుకు వెళ్తుందన్నారు. ఇక నుండైనా ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజా సమస్యలు ముందుకు తీసుకురావాలనీ ఎంపీ చామల కేసీఆర్ ను కోరారు.
Also Read: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. జర్మనీ అవకాశాలపై ఫోకస్.. విదేశాల్లో యువతకు శిక్షణ!