E-Paper
Advertisement

ఇన్‌స్టా రీల్స్‌ చూసి AC గదిలో బకెట్‌‌ నీళ్లు పెడుతున్నారా? వైద్యులు చెబుతున్న ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిస్తే..

ఇన్‌స్టా రీల్స్‌ చూసి AC గదిలో బకెట్‌‌ నీళ్లు పెడుతున్నారా? వైద్యులు చెబుతున్న ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిస్తే..
Advertisement

AC Room Tips: ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఏసీ గదిలో ఒక బకెట్‌లో నీళ్లు పెడితే చర్మం బాగుంటుంది, గొంతు నొప్పి రాదు అంటూ తెగ వీడియోలు కనిపిస్తున్నాయి. బయట ఎండలు మండిపోతుండటంతో మనమూ అవి నిజమే అనుకుని గుడ్డిగా ఫాలో అయిపోతున్నాం. కానీ, అసలు విషయం ఏంటంటే.. ఇలా నీళ్ల బకెట్ పెట్టడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గదిలో నీళ్లు అలా నిల్వ ఉంచడం వల్ల బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్ ఉందట. మరి ఏసీ వల్ల వచ్చే ఆ గొంతు నొప్పిని, చర్మం పొడిబారడాన్ని ఎలా ఆపాలి? దాని కోసం చేయాల్సిన ప్రత్యామ్నాయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మిషన్ సాయంతో తేమను పెంచడం:

ఏసీ గాలిని పీల్చినప్పుడు మన ముక్కు, గొంతు ఎండిపోకుండా ఉండాలంటే గాలిలో తేమ ఉండాలి. దీనికోసం మార్కెట్లో ‘హ్యూమిడిఫైయర్’ అనే చిన్న మిషన్లు దొరుకుతాయి. బకెట్ నీళ్ల కంటే ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే.. బకెట్‌లోని నీరు గాలిలోకి కలవడానికి చాలా టైం పడుతుంది. కానీ ఈ మిషన్ నీటిని చిన్న చిన్న ఆవిరి తుంపర్లలా గది మొత్తం సమానంగా పంపుతుంది. తక్కువ బడ్జెట్‌లోనే మంచి మిషన్లు వస్తున్నాయి, వీటిని వాడటం వల్ల హాయిగా ఊపిరి తీసుకోవచ్చు.

తడి గుడ్డతో పాతకాలపు చిట్కా:

Advertisement

మిషన్లు కొనలేని వాళ్లు మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి పాత పద్ధతిని ట్రై చేయొచ్చు. ఏదైనా తెల్లటి కాటన్ టవల్‌ని నీళ్లలో తడిపి, గదిలో ఏసీ గాలి తగిలేలా ఒక పక్కన వేలాడదీయండి. బకెట్ నీళ్ల కంటే ఈ తడి గుడ్డ చాలా స్పీడ్‌గా గాలిలోకి తేమను పంపుతుంది. దీనివల్ల గాలిలో డ్రైనెస్ తగ్గి, ఉదయం లేవగానే గొంతు గీచుకుపోయినట్టు ఉండదు. ఇది రూపాయి ఖర్చు లేని చాలా సులభమైన మార్గం.

Also Read: వన్‌ప్లస్ vs ఒప్పో.. 7000mAh బ్యాటరీతో రచ్చ లేపుతున్న ఈ రెండింటిలో ఏది కొనాలి?

ఇండోర్ ప్లాంట్స్ పెంచుదాం:

Advertisement

ఏసీ ఉన్న గదిలో.. స్నేక్ ప్లాంట్, కలబంద లాంటి మొక్కలను పెంచితే అవి గాలిని శుభ్రం చేయడమే కాకుండా, సహజంగా తేమను విడుదల చేస్తాయి. ఇవి చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఏసీ గాలి వలన మనకు ఇబ్బంది కలగకుండా మారుస్తాయి. ప్రకృతి సిద్ధంగా గదిలో తేమను పెంచడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్.

కిటికీలు, తలుపులు తీయాల్సిందే:

చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే.. ఏసీ వేయగానే గదిని ఎక్కడా గాలి చొరబడకుండా గంటల తరబడి మూసేస్తాం. దీనివల్ల గదిలో గాలి బిగుసుకుపోయి డ్రైనెస్ పెరిగిపోతుంది. అందుకే, కనీసం రెండు మూడు గంటలకోసారి ఒక ఐదు నిమిషాల పాటు కిటికీయో లేదా తలుపో తీసి ఉంచండి. బయట ఉండే సహజమైన గాలి లోపలికి వస్తే, గదిలో వాతావరణం మారుతుంది. ఇది చిన్న విషయమే అయినా మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

ఏసీతో పాటు ఫ్యాన్ కూడా..

చాలామంది ఏసీ వేస్తే ఫ్యాన్ వేయకూడదు అనుకుంటారు. కానీ ఏసీని మరీ తక్కువ డిగ్రీల దగ్గర (16 లేదా 18) పెట్టకుండా, ఒక 24 డిగ్రీల దగ్గర ఉంచి ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో వేయండి. ఇలా చేయడం వల్ల ఏసీ చల్లదనం గది మొత్తం సమానంగా త్వరగా వ్యాపిస్తుంది. దీనివల్ల ఏసీ మీద లోడ్ తగ్గుతుంది. గాలి కూడా మరీ డ్రైగా అవ్వదు. పైగా కరెంటు బిల్లు కూడా ఆదా అవుతుంది.

Also Read: Sony నుంచి మరో సెన్సేషన్.. Xperia 1 VIII ధర, ఫీచర్లు లీక్ అయ్యాయోచ్, లాంచ్ ఎప్పుడంటే?

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×