AI+ Smartwatch Pulse 2 Phone: స్వదేశీ బ్రాండ్ AI+ నుంచి బడ్జెట్ ధరలో ఇయర్బడ్స్, స్మార్ట్వాచ్లు లాంచ్ అయ్యాయి. గతేడాది జూలైలో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కంపెనీ, తక్కువ కాలంలోనే దాదాపు పది లక్షల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. తాజాగా NovaPods, NovaWatch సిరీస్లను తీసుకొచ్చిన సంస్థ.. త్వరలోనే పవర్ఫుల్ బ్యాటరీతో రానున్న పల్స్ 2 స్మార్ట్ఫోన్ను విడుదలను కూడా అధికారికంగా ప్రకటించింది.
తమ యూజర్ల బడ్జెట్ను దృష్టిలో ఉంచుకుని ఏఐ+ రకరకాల మోడళ్లను పరిచయం చేసింది. వీటిలో Novapods Go ధర కేవలం రూ.699 కాగా, మరిన్ని ఫీచర్లు ఉన్న Pro మోడల్ రూ.1,999కి లభిస్తుంది. విభిన్నమైన డిజైన్తో వచ్చిన Novapod Clips ధర రూ.3,999గా ఉంది.
Read Also: బ్రాండెడ్ అని కొనేస్తున్నారా? ఈ తేడాలు తెలియకపోతే మీ డబ్బులన్నీ వృధానే!
ఇకపోతే స్మార్ట్వాచ్ల విషయానికి వస్తే.. Novawatch Active ధర రూ.2,499 కాగా, పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన Kids 4G Watch రూ.2,999కి అందుబాటులో ఉంది. అలాగే వాచ్లోనే ఇయర్బడ్స్ ఉండే వినూత్నమైన WearBuds ధరను రూ.7,999గా నిర్ణయించారు. ఈ ప్రోడక్టులన్నీ ఫిబ్రవరి 27 నుంచి ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటాయి.
ఏఐ+ పల్స్ 2 ఫోన్ మార్చి 2న విడుదల కానుంది. దీనిలో 6,000mAh భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ చాలా స్లిమ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. అలాగే దీనిలో 50MP ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్ను అందించారు. దీని తర్వాత నోవా 2 సిరీస్ ఫోన్లను కూడా లాంచ్ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.
Novapods Proలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బ్లూటూత్ 6.0 వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి. Novawatch యాక్టివ్ మోడల్ 1.73 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో, హార్ట్ రేట్, స్లీప్ ట్రాకింగ్ వంటి హెల్త్ ఫీచర్లతో రానుంది. ఇక పిల్లల వాచ్లో జీపీఎస్, వీడియో కాలింగ్ సౌకర్యం ఉండటం వల్ల భద్రత పరంగా ఇది తల్లిదండ్రులకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
Read Also: JBL నుంచి Apple వరకు.. ఏఐ ట్రాన్స్లేషన్ ఫీచర్తో మార్కెట్లోకి కొత్త బడ్స్!