E-Paper
Advertisement

Cybersecurity App: ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ తప్పనిసరి.. డెలీట్ చేయడం కుదరదు.. కేంద్రం ఆదేశాలు

Cybersecurity App: ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ తప్పనిసరి.. డెలీట్ చేయడం కుదరదు.. కేంద్రం ఆదేశాలు
Advertisement

Mandatory Cybersecurity App In Smartphone| భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలో విక్రయించే అన్ని స్మార్ట్‌ఫోన్లలో ‘సంచార్ సాథి’ అనే సెక్యూరిటీ యాప్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ యాప్‌ను ఎవరూ డెలీట్ చేయలేరు, డియాక్టివేట్ లేదా డిసేబుల్ చేయలేరు. సైబర్ దొంగల బారి నుంచి ప్రజలను కాపాడడమే లక్ష్యంగా కేంద్రం ఈ యాప్ ని తప్పనిసరి చేసింది.

నవంబర్ 28, 2025న టెలికాం మంత్రిత్వ శాఖ రహస్యంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. శామ్‌సంగ్, ఆపిల్, షావోమీ, వివో, ఒప్పో లాంటి అన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు ఈ యాప్‌ను శాశ్వతంగా ఉండేలా ఫోన్లలో ప్రిఇన్‌‌స్టాల్ చేయాలని చెప్పింది.

ఎప్పటి నుంచి అమలు?

Advertisement

ఈ భద్రతా యాప్ ఇన్‌స్టాలేషన్ కోసం టెక్ కంపెనీలకు ప్రభుత్వం కేవలం 90 రోజులు మాత్రమే సమయం ఇచ్చింది. మార్చి 2026 నుంచి కొత్తగా వచ్చే ప్రతి ఫోన్‌లో ఈ యాప్ ఫ్యాక్టరీలోనే ఇన్‌స్టాల్ చేశాకే మార్కెట్‌లో పంపిణీ చేయాలి. ఇప్పటికే దుకాణాల్లో ఉన్న ఫోన్లకు ఆటోమాటిక్ అప్‌డేట్ చేయగానే ఈ యాప్ వచ్చేస్తుంది.

(Sanchar Saathi) ‘సంచార్ సాథి’ యాప్‌తో లాభాలు ఇవే..

  • మోసపూరితమైన కాల్స్, ఫేక్ మెసేజెస్, వాట్సాప్ మెసేజ్‌లను ఈ యాప్ ద్వారా రిపోర్ట్ చేయొచ్చు
  • ఫోన్ పోగొట్టుకుంటే ఈ యాప్‌లో IMEI నంబర్ ద్వారా ఆ ఫోన్ పూర్తిగా బ్లాక్ చేయొచ్చు. ఈ యాప్ సాయంతో ఇప్పటికే 7 లక్షలకు పైగా చోరికి గురైన, పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి దొరికాయి
  • మీ పేరుతో ఎన్ని సిమ్‌లు ఉపయోగంలో ఉన్నాయో చూసి, సందేహాస్పంగా ఉన్న సిమ్‌లను బ్లాక్ చేయొచ్చు
  • కొత్త ఫోన్ ఒరిజినల్ లేదా నకిలీనా చెక్ చేసుకోవచ్చు

ఈ యాప్ ఎప్పుడు మొదలైంది?

2023లో టెలికాం శాఖ ఈ యాప్‌ను ప్రారంభించింది. అప్పుడు యాప్ కావాల్సి వస్తేనే ప్లేస్టోర్, యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునేవారు. ఇప్పుడు అది తప్పనిసరి అయిపోయింది.

భారీ ప్రభావం

Advertisement

భారతదేశంలో 120 కోట్లకు పైగా మొబైల్ వినియోగదారులు ఉన్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ ఇండియా. కాబట్టి ఈ కొత్త నియమం కోట్లాది మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లపై ప్రభావం చూపుతుంది.

ఆపిల్‌కు పెద్ద సమస్య!

ఆపిల్ కంపెనీ తన ఐఫోన్‌లలో తన యాప్స్ తప్ప ఇతరుల యాప్‌ను శాశ్వతంగా పెట్టనివ్వదు. అయితే భారత ప్రభుత్వం ఈ యాప్‌ని తప్పనిసరి చేయడంలో ఆపిల్ దీనికి అంగీకరిస్తుందా లేదా అనేది స్పష్టం కాలేదు. ఇంతవరకూ ఆపిల్ అధికారికంగా స్పందించలేదు. మరోవైపు శామ్‌సంగ్, గూగుల్, షావోమీ కంపెనీలు కూడా మౌనంగా ఉన్నాయి.

దేశంలో ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్ట్‌ కేసులు, సైబర్ దొంగతనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వం సంచార్ సాథి యాప్ ని ప్రజలు తప్పనిసరిగా ఉపయోగించాలని తద్వారా సైబర్ నేరాలకు చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం చెబుతోంది. కానీ కొందరు ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం వల్ల ప్రజలకు ప్రైవెసీ ఉండదని వాదిస్తున్నారు. మరో 90 రోజుల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందనేది చూడాలి.

Also Read: షాకింగ్ ఆఫర్.. రూ.22000 కంటే తక్కువ ధరలో కొత్త ఐఫోన్..

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×