Samsung Eid Offer| రంజాన్ పండుగ సందర్భంగా శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త ‘ఈద్ స్పెషల్’ క్యాంపెయిన్ ప్రారంభించింది. కొత్త టెక్నాలజీగల స్మార్ట్ అప్లయన్సెస్, తక్కువ కరెంట్ వినియోగించే మెషీన్లతో అప్డేట్ చేయాలనుకునేవారికి ఈ క్యాంపెయిన్ సహాయపడుతుంది. ఈ స్పెషల్ ప్రొగ్రామ్లో AI ఫీచర్లతో కూడిన రెఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండిషనర్లు, మైక్రోవేవ్లు ఈ ఆఫర్లో ఉన్నాయి.
శాంసంగ్ గృహోపకరణాల కోసం అభివృద్ధి చేసిన Bespoke AI టెక్నాలజీతో ఈ అప్లయన్సెస్ ఇటీవలే లాంచ్ అయ్యాయి. ఇప్పుడు రంజాన్ ఈద్ ఆఫర్లో కొనుగోలు చేస్తే రూ.20,000 వరకు క్యాష్బ్యాక్ పొందవచ్చు. కొన్ని మోడల్స్పై జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. సులభంగా EMIలో కొనుగోలు చేయవచ్చు. ఎయిర్ కండిషనర్లు కొంటే ఫ్రీ ఇన్స్టాలేషన్, 5 సంవత్సరాల కాంప్రహెన్సివ్ వారంటీ కూడా లభిస్తుంది.
Bespoke AI ఎయిర్ కండిషనర్లలో ఏఐ ఫాస్ట్ కూలింగ్, కంఫర్ట్ కూలింగ్ ఫీచర్లు ఉన్నాయి. గదిని త్వరగా చల్లబరుస్తాయి, ఎయిర్ఫ్లోను ఆటోమాటిక్గా అడ్జస్ట్ చేసి గది ఉష్ణోగ్రత చల్లబరిచి సౌకర్యవంతంగా చేస్తాయి. ఇందులోని SmartThings Home Care ఫీచర్ AC పర్ఫామెన్స్ని రియల్-టైమ్లో మానిటర్ చేస్తుంది. గ్యాస్ తక్కువగా ఉంటే లేదా ఫిల్టర్ శుభ్రం చేయాల్సిన అవసరం ఉంటే ముందుగానే అలర్ట్ ఇస్తుంది.
Bespoke AI రెఫ్రిజిరేటర్లో ఏఐ విజన్ ఇన్సైడ్ ఫీచర్ ఉంది. లోపల ఏ ఆహార పదార్థాలు ఉన్నాయో గుర్తిస్తుంది. ఆహారాన్ని చెడిపోకుండా కాపాడడానికి స్మార్ట్ సజెషన్లు ఇస్తుంది. Bespoke AI వాషింగ్ మెషిన్లో AI Wash టెక్నాలజీ ఉంది. బట్టల రకం, లోడ్ బరువు బట్టి నీరు, డిటర్జెంట్ మొత్తాన్ని ఆటోమాటిక్గా అడ్జస్ట్ చేస్తుంది. వాష్ సైకిల్స్ సరిగ్గా సెట్ అవుతాయి.
ఈ ‘ఈద్ స్పెషల్’ క్యాంపెయిన్ మార్చి 22, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ అధికారిక వెబ్సైట్, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఈ అప్లయన్సెస్ కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ హోమ్ సౌకర్యాలను ఆస్వాదించే అవకాశం ఇస్తోంది.
ఈ అప్లయన్సెస్ యూజర్ ఎక్స్పీరియన్స్ని మెరుగుపరుస్తాయి, తక్కువ కరెంట్ వినియోగిస్తాయి. ఇంటెలిజెంట్ మానిటరింగ్, ఆటోమాటిక్ అడ్జస్ట్మెంట్స్తో రోజువారీ పనులు సులభమవుతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. ఇల్లు మరింత సౌకర్యవంతంగా, ఎఫిషియంట్గా మారుతుంది.