E-Paper
Advertisement

Education commission : విద్యా కమిషన్‌కి సలహా కమిటీ.. జీవో జారీ చేసిన రేవంత్ సర్కార్

Education commission : విద్యా కమిషన్‌కి సలహా కమిటీ.. జీవో జారీ చేసిన రేవంత్ సర్కార్

Education commission : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యా కమిషన్‌కు ఆరుగురితో సలహా కమిటీ ఏర్పాటు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యుల్లో ప్రొఫెసర్ హరగోపాల్, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్స్ కె.మురళీ మోహన్, కె.వెంకట నారాయణ, శాతవాహన యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, ఎంవీ ఫౌండేషన్ కన్వీనర్ వెంటకరెడ్డి, యునిసెఫ్ విద్యా నిపుణుడు కెఎం. శేషగిరి ఉన్నారు. గతంలో విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా కమిషన్ కు సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ALSO READ:జగన్ గురువుకు షాకిచ్చిన సీఎం చంద్రబాబు.. ఇంతటితో ఆగేనా.. ఇంకా ఉందా..

లోపాలను సరిదిద్దేందుకు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం రేవంత్ రెడ్డి విద్య మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆకునూరి మురళి ఛైర్మన్‌గా విద్యాకమిషన్ ఏర్పాటుకాగా, మరో ముగ్గురు సభ్యులను ప్రభుత్వం నియమించింది. తాజాగా, ఈ కమిషన్‌కు అనుబంధంగా ఆరుగురు విద్యారంగ నిపుణులతో ఒక సలహా మండలిని ఏర్పాటు చేసింది. ప్రాథమికం నుంచి ఉన్నత విద్య వరకు రాష్ట్ర విద్యా వ్యవస్థలోని లోపాలపై ఈ కమిటీ కమిషన్‌కు సలహాలు, సూచనలు ఇవ్వనుంది. అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో రావాల్సిన మార్పుల గురించి కూడా ఈ సలహా కమిటీ మార్గదర్శకత్వం వహించనుంది.

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×