E-Paper
Advertisement

Cyber Crime : నిరుద్యోగులే వారి టార్గెట్.. సైబర్ ముఠాకు చిక్కుతున్న యువత.. అసలు కారణం ఇదేనట!

Cyber Crime : నిరుద్యోగులే వారి టార్గెట్.. సైబర్ ముఠాకు చిక్కుతున్న యువత.. అసలు కారణం ఇదేనట!

Cyber Crime : సైబర్ క్రైమ్స్.. ఈ మాట వింటేనే ప్రతీ ఒక్కరూ హడలెత్తిపోతున్నారు. ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లు దోపిడీకి పాల్పడుతున్నారు. నమ్మిన వాళ్లని ఆసరాగా తీసుకొని కోట్లు కొల్లగొడుతున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారిలో ఏ వర్గం మినహాయింపు కాకపోయినప్పటికీ.. ముఖ్యంగా ఉద్యోగం లేని నిరుద్యోగులే మొదటి జాబితాలో ఉన్నారని తాజా అధ్యయనంలో బయటపడింది.

నిరుద్యోగులు సైబర్ నేరగాళ్ల వలలో ఎక్కువగా పడుతున్నారని తాజాగా జరిగిన ఓ అధ్యయనం తెలిపింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ జరుగుతున్న మోసాల్లో ఇరుక్కొని డబ్బులు పోగొట్టుకుంటున్నారని.. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం వల్ల తెలియని చిక్కుల్లో ఇరుక్కుంటున్నారని.. మానవ వనరుల సేవల సంస్థ జీనియస్ కన్సల్టెంట్ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడించింది.

⦿ ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని సంపాదించాలని.. జీవితంలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. అయితే అనుకున్న స్థాయిలో జీవితంలో రాణించలేని వారి మనస్తత్వంతో సైబర్ నేరగాళ్లు ఆడుకుంటున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగాలు ఇప్పిస్తామని, నియామక సంస్థలమని చెబుతూ చేస్తున్న మోసాల్లో 75% మంది ఉద్యోగులే ఉన్నారని తెలుస్తోంది.

⦿ ఇక ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలు మోసాలు జరుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వంతో పాటు సైబర్ పోలీసులు చేపడుతున్న చర్యలు సరిపోతాయని 28% మాత్రమే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక 55 శాతం మంది ఈ అభిప్రాయాన్ని విభేదిస్తూ మోసాల నియంత్రణకు కఠిన చర్యలు రావాలని తెలిపారు. ఎన్ని విధాల సైబర్ నేరాలను అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ జరుగుతూనే ఉన్నాయని… ఇంకా సైబర్ సెక్యూరిటీ పైన సాధారణ ప్రజలకు అవగాహన రావాలని చెప్పుకొచ్చారు.

⦿ ఉన్నత స్థాయి చదువులు చదివిన వారు సైతం ఉనికిలో లేని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధంగా సైబర్ నేరగాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ అధ్యయనం తెలిపింది. ఇలాంటి అనుభవం దాదాపు 70 శాతం మంది ఉన్నతస్థాయి వ్యక్తులే ఎదుర్కొన్నట్టు చెప్పుకు వచ్చింది. ఉద్యోగం కావాలని ఆకాంక్షించే వారి నమ్మకాన్ని సొమ్ము చేసుకోవాలని నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారని తెలిపింది.

⦿ ఉద్యోగం పేరుతో డబ్బులు దండుకునే సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలతో పాటు క్రెడిట్ కార్డులకు సంబంధించిన వివరాలు సైతం కోరగా మూడు శాతం మంది అమాయకంగా మోసపోతున్నారని వ్యక్తిగత సమాచారాన్ని వారికి అందిస్తున్నారని తేలింది ఈ సర్వే.

⦿ ఐటీ రంగంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నేరగాళ్లు నమ్మిస్తున్నారని.. సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలని ప్రయత్నించి మోసపోతున్నవారే ఎక్కువగా ఉన్నారని తెలిపింది. తర్వాత స్థానాల్లో రిటైల్, ఈ కామర్స్, ఫైనాన్స్, హెల్త్ రంగాలు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగంలో ఆన్లైన్ ఉద్యోగ నియామకాలు ఎక్కువ అవ్వటం వలన మోసాలు జరిగే అవకాశాలు సైతం పెరిగాయని తెలిపిన ఈ సర్వే ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పుకు వచ్చింది.

⦿ ఇక నుంచైనా అప్రమత్తంగా ఉండాలని.. .ఆన్ లైన్ మోసాల భారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సర్వే నిరుద్యోగులను హెచ్చరించింది. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని.. ఈ డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు ప్రతీ విషయాన్ని పసిగడుతున్నారనే విషయాన్ని గుర్తించాలని జీనియస్ కన్సల్టెంట్ తెలిపింది.

ALSO READ : పబ్లిక్ ఏరియాలో WiFi వాడుతున్నారా? మీ సీక్రెట్స్ అన్నీ?

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×