BigTV English
Advertisement

Pig Butchering Scam : వామ్మో.. బెంబేలెత్తిస్తున్న కొత్త స్కామ్! స్నేహితులే శత్రువులు.. నమ్మకమే ఆయుధంగా నేరాలు

Pig Butchering Scam : వామ్మో.. బెంబేలెత్తిస్తున్న కొత్త స్కామ్! స్నేహితులే శత్రువులు.. నమ్మకమే ఆయుధంగా నేరాలు

Pig Butchering Scam : గృహిణులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, పేదలను లక్ష్యంగా చేసుకుని ఓ స్కామ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పిగ్‌ బుచరింగ్‌ స్కామ్‌ లేదా ఇన్వెస్ట్‌మెంట్‌ స్కామ్‌గా దీన్ని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఇటువంటి సైబర్‌ మోసాలు భారీ స్థాయిలో పెరిగాయని తాజాగా కేంద్ర హోం శాఖ ఓ నివేదికను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్​ ద్వారా ప్రజలు భారీ స్థాయిలో నష్టపోతున్నారని వెల్లడించింది. ఈ సైబర్ మోసాల కోసం సైబర్‌ నేరగాళ్లు సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​ను అత్యధికంగా వినియోగించుకుంటున్నారని పేర్కొంది.


పిగ్‌ బుచరింగ్‌ స్కామ్‌ అంటే ఏమిటి? –

ఈ పిగ్ బుచరింగ్ స్కామ్​లో సైబర్‌ నేరగాళ్లు, తేలికగా మోసపోయే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని, వారితో లాంగ్ టెర్మ్​ రిలేషన్​షిప్​ను మెయిన్​టెయిన్ చేస్తుంటారు. వాట్సాప్​, ఫేస్​బుక్​, డేటింగ్ సైట్స్​, మెసేజింగ్ యాప్స్​ , ఈమెయిల్స్​ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్ ద్వారా​ వారితో ఎమోషనల్​గా, అలానే ఫైనాన్షియల్​గా బంధాన్ని ఏర్పరచుకుంటారు. అలా ఫ్రెండ్లీ స్ట్రేంజర్స్​గా, రొమాంటిక్ పార్ట్నర్స్​గా, ఫైనాన్షియల్​ అడ్వైసర్స్​గా పర్సనల్​ కనెక్షన్​ ఏర్పరచుకుంటారు.​ ముఖ్యంగా వారితో ఈ సైబర్ నేరగాళ్లు విశ్వాసం కలిగించేలా మాట్లాడుతుంటారు.


ఈ క్రమంలోనే స్టాక్స్​, క్రిప్టో కరెన్సీలో లేదా మరో లాభదాయకమైన పథకం అంటూ ఫేక్​ ఇన్​వెస్ట్​మెంట్​లో పెట్టుబడి పెట్టేలా ఒప్పించి చివరకు ఆ మొత్తాన్ని తస్కరించడం ఈ సైబర్ నేరగాళ్ల లక్ష్యం. ముందుగా జీరో రిస్క్​ అంటూ, వినియోగదారుల నుంచి చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టించి, వారికి ఎక్కువ లాభం వచ్చేలా నమ్మబలికిస్తారు. దీనిని నమ్మిన వినియోగదారులు, డబ్బుకు ఆశపడి, ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడతారు. దీనిని అదునుగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు, సమయం చూసి ఆ మొత్తాన్ని దోచేస్తారు. దీనినే పిగ్‌ బుచరింగ్‌ లేదా ఇన్​వెస్ట్​మెంట్​ స్కామ్​ అని అంటారు.

ALSO READ : రూ.6999కే మోటో కొత్త మెుబైల్.. కిర్రాక్ ఫీచర్స్ తో జనవరి 7న లాంఛ్

పందులను చంపే ముందు, కసాయి వాడు వాటికి మంచి ఆహారం ఎలా అయితే అందిస్తాడో, ఇన్​వెస్ట్​మెంట్​ స్కామర్స్​ కూడా అలానే వినియోగదారులకు వల వేస్తారు. అందుకే ఈ పిగ్​ బుచరింగ్​ అనే పదం బాగా వెలుగులోకి వచ్చింది. 2016లో తొలిసారిగా చైనాలో ఇలాంటి స్కామ్​లు మొదలైనట్లు సమాచారం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి మోసాలు భారీగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా, భారత్‌లో సైబర్‌ నేరగాళ్లు వాట్సప్‌ను ఉపయోగించి భారీ స్థాయిలో ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నట్లు నివేదికలు తెలిపాయి. రుణాలను కూడా ఇస్తామంటూ ఫేస్‌బుక్‌ వంటి ప్లాట్​ఫామ్స్​ ద్వారా లింకులను వ్యాప్తి చేస్తున్నారని వెల్లడించాయి.

ఎలా జాగ్రత్తగా ఉండాలంటే? –

కాబట్టి ఇటువంటి పిగ్​ బుచరింగ్ స్కామ్స్​ నుంచి అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో స్ట్రేంజర్స్​తో కనెక్షన్స్​ మెయిన్​టెయిన్​ చేయకపోవడమే ఉత్తమం. ఒకవేళ వారితో పర్సనల్ కనెక్షన్స్ ఉంటే, వాటి నుంచి బయట పడటమే మంచిది. వారితో కనెక్షన్ మెయిన్​టెయిన్ చేసినా, గుడ్డిగా నమ్మకూడదు. వారు చెప్పిన విషయాల్లో ఇన్వెస్ట్​మెంట్​లు చేయకూడదు. ఏ కొంచెం అనుమానంగా అనిపించినా ఫిర్యాదు చేయడం మంచిది.

Related News

Huawei Mate 70 Air: ఐఫోన్ ఎయిర్‌కి పోటిగా హవాయ్ కొత్త స్లిమ్ ఫోన్.. పెద్ద 7 ఇంచ్ డిస్‌ప్లే‌తో మేట్ 70 ఎయిర్ లాంచ్

Google Maps: గూగుల్ మ్యాప్స్ నుంచి క్రేజీ ఫీచర్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Google Pixel 10: గూగుల్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.15 వేలు తగ్గింపు, వెంటనే ఈ క్రేజీ డీల్‌ పట్టేయండి!

Smartphone Comparison: వివో Y19s 5G vs iQOO Z10 Lite 5G vs మోటో G45 5G.. రూ.12,000లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Oppo Reno 13 Pro+: ఫ్లాగ్‌షిప్‌లను ఢీ కొట్టే రెనో 13 ప్రో ప్లస్.. ఆఫర్ ధర వింటే ఆశ్యర్యపోతారు..

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి

Big Stories

×