E-Paper
Advertisement

Pig Butchering Scam : వామ్మో.. బెంబేలెత్తిస్తున్న కొత్త స్కామ్! స్నేహితులే శత్రువులు.. నమ్మకమే ఆయుధంగా నేరాలు

Pig Butchering Scam : వామ్మో.. బెంబేలెత్తిస్తున్న కొత్త స్కామ్! స్నేహితులే శత్రువులు.. నమ్మకమే ఆయుధంగా నేరాలు
Advertisement

Pig Butchering Scam : గృహిణులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, పేదలను లక్ష్యంగా చేసుకుని ఓ స్కామ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పిగ్‌ బుచరింగ్‌ స్కామ్‌ లేదా ఇన్వెస్ట్‌మెంట్‌ స్కామ్‌గా దీన్ని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఇటువంటి సైబర్‌ మోసాలు భారీ స్థాయిలో పెరిగాయని తాజాగా కేంద్ర హోం శాఖ ఓ నివేదికను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్​ ద్వారా ప్రజలు భారీ స్థాయిలో నష్టపోతున్నారని వెల్లడించింది. ఈ సైబర్ మోసాల కోసం సైబర్‌ నేరగాళ్లు సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​ను అత్యధికంగా వినియోగించుకుంటున్నారని పేర్కొంది.

పిగ్‌ బుచరింగ్‌ స్కామ్‌ అంటే ఏమిటి? –

Advertisement

ఈ పిగ్ బుచరింగ్ స్కామ్​లో సైబర్‌ నేరగాళ్లు, తేలికగా మోసపోయే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని, వారితో లాంగ్ టెర్మ్​ రిలేషన్​షిప్​ను మెయిన్​టెయిన్ చేస్తుంటారు. వాట్సాప్​, ఫేస్​బుక్​, డేటింగ్ సైట్స్​, మెసేజింగ్ యాప్స్​ , ఈమెయిల్స్​ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్ ద్వారా​ వారితో ఎమోషనల్​గా, అలానే ఫైనాన్షియల్​గా బంధాన్ని ఏర్పరచుకుంటారు. అలా ఫ్రెండ్లీ స్ట్రేంజర్స్​గా, రొమాంటిక్ పార్ట్నర్స్​గా, ఫైనాన్షియల్​ అడ్వైసర్స్​గా పర్సనల్​ కనెక్షన్​ ఏర్పరచుకుంటారు.​ ముఖ్యంగా వారితో ఈ సైబర్ నేరగాళ్లు విశ్వాసం కలిగించేలా మాట్లాడుతుంటారు.

ఈ క్రమంలోనే స్టాక్స్​, క్రిప్టో కరెన్సీలో లేదా మరో లాభదాయకమైన పథకం అంటూ ఫేక్​ ఇన్​వెస్ట్​మెంట్​లో పెట్టుబడి పెట్టేలా ఒప్పించి చివరకు ఆ మొత్తాన్ని తస్కరించడం ఈ సైబర్ నేరగాళ్ల లక్ష్యం. ముందుగా జీరో రిస్క్​ అంటూ, వినియోగదారుల నుంచి చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టించి, వారికి ఎక్కువ లాభం వచ్చేలా నమ్మబలికిస్తారు. దీనిని నమ్మిన వినియోగదారులు, డబ్బుకు ఆశపడి, ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడతారు. దీనిని అదునుగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు, సమయం చూసి ఆ మొత్తాన్ని దోచేస్తారు. దీనినే పిగ్‌ బుచరింగ్‌ లేదా ఇన్​వెస్ట్​మెంట్​ స్కామ్​ అని అంటారు.

Advertisement

ALSO READ : రూ.6999కే మోటో కొత్త మెుబైల్.. కిర్రాక్ ఫీచర్స్ తో జనవరి 7న లాంఛ్

పందులను చంపే ముందు, కసాయి వాడు వాటికి మంచి ఆహారం ఎలా అయితే అందిస్తాడో, ఇన్​వెస్ట్​మెంట్​ స్కామర్స్​ కూడా అలానే వినియోగదారులకు వల వేస్తారు. అందుకే ఈ పిగ్​ బుచరింగ్​ అనే పదం బాగా వెలుగులోకి వచ్చింది. 2016లో తొలిసారిగా చైనాలో ఇలాంటి స్కామ్​లు మొదలైనట్లు సమాచారం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి మోసాలు భారీగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా, భారత్‌లో సైబర్‌ నేరగాళ్లు వాట్సప్‌ను ఉపయోగించి భారీ స్థాయిలో ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నట్లు నివేదికలు తెలిపాయి. రుణాలను కూడా ఇస్తామంటూ ఫేస్‌బుక్‌ వంటి ప్లాట్​ఫామ్స్​ ద్వారా లింకులను వ్యాప్తి చేస్తున్నారని వెల్లడించాయి.

ఎలా జాగ్రత్తగా ఉండాలంటే? –

కాబట్టి ఇటువంటి పిగ్​ బుచరింగ్ స్కామ్స్​ నుంచి అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో స్ట్రేంజర్స్​తో కనెక్షన్స్​ మెయిన్​టెయిన్​ చేయకపోవడమే ఉత్తమం. ఒకవేళ వారితో పర్సనల్ కనెక్షన్స్ ఉంటే, వాటి నుంచి బయట పడటమే మంచిది. వారితో కనెక్షన్ మెయిన్​టెయిన్ చేసినా, గుడ్డిగా నమ్మకూడదు. వారు చెప్పిన విషయాల్లో ఇన్వెస్ట్​మెంట్​లు చేయకూడదు. ఏ కొంచెం అనుమానంగా అనిపించినా ఫిర్యాదు చేయడం మంచిది.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×