Moshin Naqvi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటుకు పోటీగా వచ్చిన పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 ) అద్భుతంగానే సాగుతోంది. ఈ టోర్నమెంటులో నిన్నటి వరకు బాల్ టాంపరింగ్ ( Ball tampering) వ్యవహారం హాట్ టాపిక్ కాగా ఇప్పుడు మరో అంశం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB) చైర్మన్ పదవిలో ఉన్న మొహ్సీన్ నఖ్వీ ( Moshin Naqvi ) 20 మిలియన్ డాలర్ల స్కాం ( $20 Million Scam by Moshin Naqvi ) చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే దాదాపు రూ.167 కోట్లు పందికొక్కులాగా తిన్నాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గడాఫీ స్టేడియం (adaafi Stadium ) వర్షం పడితే, చెరువులా మారిపోయింది. ఈ క్రమంలోనే మొహ్సీన్ నఖ్వీ స్కాం బయట పెట్టి సోషల్ మీడియాలో దారుణంగా ఆడుకుంటున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్.
Also Read: PSL 2026: PSLను అతలాకుతలం చేసిన తుఫాన్..గాల్లో ఎగిరిపడ్డ గ్రౌండ్ మెన్లు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Pakistan Super League 2026 ) భాగంగా మంగళవారం రోజున ఇస్లామాబాద్ యునైటెడ్ vs పెషావర్ జల్మీ ( Islamabad United vs Peshawar Zalmi ) జరగాల్సి ఉంది. లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా ( Gaddafi Stadium, Lahore ) ఈ మ్యాచ్ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే లాహోర్ లో భారీ వర్షం పడింది. దీంతో మ్యాచ్ పూర్తిగా రద్దయింది. వాస్తవంగా ఏడు గంటలకు ప్రారంభమైన వర్షం 30 నిమిషాల పాటు దంచి కొట్టింది. అయితే ఆ తర్వాత చెరువులాగా మారిపోయింది గడాఫీ స్టేడియం. సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. మూడు గంటలైనా కూడా స్టేడియాన్ని రెడీ చేయలేకపోయారు. దీంతో మ్యాచ్, టాస్ పడకుండానే పూర్తిగా రద్దు అయింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సీన్ నఖ్వీ 167 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడని ఆరోపణలు వస్తున్నాయి.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తరఫున కొన్ని నిధులు విడుదలయ్యాయి. గడాఫీ స్టేడియం రిపేర్ కోసం దాదాపు 46 మిలియన్ డాలర్లు విడుదల చేశారు. అంటే దాదాపు 400 కోట్ల వరకు రిలీజ్ చేశారన్నమాట. అయితే ఇందులో నాసిరకమైన పనులు మొహ్సీన్ నఖ్వీ చేయించినట్లు చెబుతున్నారు. సగం ఖర్చుపెట్టి మిగిలిన 167 కోట్లు నొక్కేసాడని మొహ్సీన్ నఖ్వీపై ఆరోపణలు వస్తున్నాయి. అతడు అప్పుడు చేసిన తప్పిదం కారణంగా ఇవాళ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో మ్యాచ్ రద్దు అయిందని అభిమానులు సీరియస్ అవుతున్నారు. వెంటనే ఈ 167 కోట్లు కక్కించాలని.. చైర్మన్ పదవికి మొహ్సీన్ నఖ్వీ రాజీనామా చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పాకిస్థాన్ అభిమానులు. మరి ఈ ఆరోపణల నేపథ్యంలో మొహ్సీన్ నఖ్వీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read: Shahid Afridi: నాకు ఛాన్స్ ఇవ్వండి..టీమిండియాకు 100 మంది బుమ్రాలను తయారు చేస్తా
🚨 THE $20 MILLION PCB HEIST? 🚨
The PCB sanctioned PKR 12.8 Billion ($46M) to upgrade Gaddafi Stadium for the 2025 Champions Trophy. The result? A total disaster.
Despite the massive budget, the stadium still has:
❌ No Roof
❌ No LED Lights
❌ No Advanced Drainage
❌ No Super… pic.twitter.com/xvBK1qLYh8— Cricket Central (@CricketCentrl) March 31, 2026