E-Paper
Advertisement

Afghanistan Cricketers: అర్థ‌రాత్రి దొంగ‌దెబ్బ‌…పాకిస్తాన్ దాడిలో ఆఫ్ఘనిస్తాన్ ముగ్గురు క్రికెటర్లు మృతి

Afghanistan Cricketers: అర్థ‌రాత్రి దొంగ‌దెబ్బ‌…పాకిస్తాన్ దాడిలో ఆఫ్ఘనిస్తాన్ ముగ్గురు క్రికెటర్లు మృతి
Advertisement

Afghanistan Cricketers: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ దొంగ దెబ్బలు తీస్తుంటే ఆఫ్గనిస్తాన్ తాలిబ‌న్లు నేరుగా వెళ్లి చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పెను విషాదం చోటుచేసుకుంది. పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు మృతి చెందారు. ఈ సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయితే ఈ వైమానిక దాడుల్లో మరణించింది ఆఫ్ఘనిస్తాన్ క్లబ్ లెవెల్ క్రికెటర్లు అని తెలుస్తోంది.

Also Read: LSG – Kane Williamson: సంజీవ్ గోయెంకా తెలివి త‌క్కువ నిర్ణ‌యం…అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కేన్ మామ కోసం పాకులాట ?

పాక్ దాడుల్లో ఆఫ్గనిస్తాన్ క్రికెటర్లు మృతి

Advertisement

పాకిస్తాన్ అర్ధరాత్రి జరిపిన వైమానిక దాడుల్లో ఏకంగా ముగ్గురు ఆఫ్గనిస్తాన్ క్లబ్ లెవెల్ క్రికెటర్లు మరణించారు. ఆ క్రికెటర్లతో పాటు మరో ఎనిమిది మంది సాధారణ పౌరులు మృతి చెందినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అటు ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అధికారికంగా వెల్లడించినట్లు న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి. మ్యాచ్ లు పూర్తి అయ్యాక క్రికెటర్లు ప్రాక్టికా ప్రావిన్స్ లోని షరానా నుంచి ఆర్గోన్ కు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ బాంబు దాడులు జరిపింది. దీంతో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్లబ్ లెవెల్ క్రికెటర్లతో పాటు 8 మంది మరణించారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయాల పాలు అయిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో పలువురు క్రికెటర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మృతి చెందిన క్రికెటర్లను కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్‌గా గుర్తించారు.

అస‌లు ఎందుకు పాకిస్థాన్ అప్ఘ‌నిస్తాన్ గొడ‌వ‌ ?

పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ప్రస్తుతం గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ గొడవలు ఇప్పటినుంచి జరుగుతున్నది కాదు. దీని వెనుక చాలా చరిత్ర ఉంది. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య వివాదానికి ముఖ్యమైన కారణం డ్యూరాండ్ రేఖ సరిహద్దు వివాదం. పాకిస్తాన్ లో ఉగ్రవాద దాడులకు ఆఫ్ఘనిస్తాన్ గడ్డను ఉపయోగించుకుంటున్న పాకిస్తాన్ తాలిబన్ అంశం కూడా ఒకటి. అంతే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు, సరిహద్దు సమస్యలు కూడా ఈ గొడవకు దారితీస్తున్నాయి.

Advertisement

ఇక అక్టోబర్ 9వ తేదీ 2025 అంటే మొన్న గురువారం రోజున కాబూల్‌ సహా పలు ఆఫ్ఘనిస్తాన్ నగరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల నేపథ్యంలో చాలామంది ఆఫ్గనిస్తాన్ పౌరులు మరణించారు. ముఖ్యంగా టీటీపీ నాయకుడు నూరు వాలి లక్ష్యంగా ఈ దాడులు చేశారు. కానీ అతడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఆ టీటీపీ నాయకుడికి ఆఫ్ఘనిస్తాన్ ఆతిథ్యం ఇస్తోందని పాకిస్తాన్ కు కోపం. అయితే ఈ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ కు ఫుల్ సపోర్ట్ ఇస్తోంది ఇండియా. దీంతో పాకిస్తాన్ విలవిలలాడిపోతోంది. అంతేకాదు దొంగ దెబ్బ తీయాలని పాకిస్తాన్ అనుకుంటూ ఉంటే, తాలిబన్స్ మాత్రం నేరుగా చూసుకుందాం అంటున్నారు.

Also Read: Commonwealth Games 2030 : 2030 కామన్‌ వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం..అసలు వీటికి ఆ పేరు ఎలా వ‌చ్చింది

 

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×