Video Viral : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కొన్ని మ్యాచ్ ల్లో 6 బంతుల్లో 6 సిక్స్ లు కొడితే.. మరికొన్ని మ్యాచ్ ల్లో 6 బంతుల్లో 6 ఫోర్లు, కొన్ని సార్లు వరుసగా 4 బంతుల్లో నాలుగు వికెట్లు లేదా హ్యాట్రిక్ వికెట్లు తీసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇక గల్లీ క్రికెట్ లో అయితే చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాస్తవానికి గల్లీ క్రికెట్ ను ఎక్కడెక్కడ ఆడుతారంటే.. పార్కింగ్ స్థలంలో, బీచ్లో లేదా ఖాళీ వీధిలో మీరు దీన్ని మీ ఇంటి కారిడార్లో కూడా ఆడవచ్చు. ఇలా ఆడితే అది గల్లీ క్రికెట్ అవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. గల్లీ క్రికెట్ లో క్రికెట్ ఆడుతుంటే ఫీల్డర్ అక్కడ నిలబడి ఉన్నాడు. బౌలర్ బంతి వేయగానే బ్యాట్స్ మెన్ గట్టిగా బంతిని కొట్టడంతో అది కరెక్ట్ గా అక్కడ నిలబడ్డ వ్యక్తి ప్రైవేట్ పార్ట్ కి తాకింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : IPL 2025 : ఐపీఎల్ 2025 ఎలిమినేట్..క్యాటరింగ్ చేసుకుంటున్న రాజస్థాన్, చెన్నై !
ఇటీవలే టీ 20 గల్లీ క్రికెట్ లో మంగోలియా క్రికెట్ జట్టు చెత్త రికార్డును నమోదు చేసింది. సింగపూర్తో జరిగిన మ్యాచులో 10 ఓవర్లలో 10 రన్స్కి ఆలౌట్ అయింది. అందులో 8 రన్స్ బ్యాటర్లు చేసినవి కాగా.. 2 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో వచ్చాయి. దీంతో టీ20 క్రికెట్లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా మంగోలియా నిలిచింది. అయితే మంగోలియా నిర్దేశించిన 11 పరుగుల లక్ష్యాన్ని సింగపూర్.. 5 బంతుల్లోనే ఛేదించడం గమనార్హం. ఇలాంటి రికార్డులు అన్ని గల్లీలలో ఎక్కువగా జరుగుతుంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అయితే కానీ మనకు తెలియదు. క్రికెట్ ని ఇలా కూడా ఆడుతారా..? అంటూ అందరూ తెగ చర్చించుకుంటున్నారు. చాలా వరకు గల్లీ క్రికెట్ రికార్డులు స్థానిక టోర్నమెంట్లలో నమోదు చేయబడతాయి, ఇక్కడ పాల్గొనే జట్ల సంఖ్య, అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ళు, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు మొదలైనవి రికార్డులలో ఉంటాయి.
గల్లీ క్రికెట్ ను అటు పక్కకు పెడితే.. ప్రస్తుతం పాక్-ఇండియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడింది. దీంతో భారీ నష్టాలు వచ్చినట్టు సమాచారం. మే 16వ తేదీ నుంచి ఐపీఎల్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. వాస్తవానికి వారం రోజుల పాటు వాయిదా వేశారు. కొన్ని మ్యాచ్ లు రద్దు కూడా అయ్యాయి. ప్రేక్షకులను, క్రీడాకారులను దృష్టిలో పెట్టుకొని వారికి ఇబ్బంది కలుగకూడదని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్-పాక్ వివాదం సద్దుమణిగిందని నిన్న ట్రంప్ ప్రకటించాడు. అయినప్పటికీ పాక్ మాత్రం భారత్ పై యుద్దం చేస్తోంది. భారత్ కూడా పాకిస్తాన్ క్షిపణులపై దాడి చేస్తోంది. దీంతో రేపు భారత్ – పాక్ మద్య కీలక చర్చలు జరుపనున్నట్టు సమాచారం. గల్లీ క్రికెట్ లో బంతిని బలంగా కొట్టడంతో ఓ వ్యక్తికి తగలరాని చోట తగిలి ఇబ్బంది పడుతున్నాడు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Gandhi ji ke 3 fielders be like 😂 pic.twitter.com/GgVEXZ8C0m
— Out Of Context Cricket (@GemsOfCricket) May 11, 2025