ఈ నెల 23వ తేదీన స్మృతి మందానను పెళ్లి చేసుకోబోతున్న పలాష్ ముచ్చల్… తనకు కాబోయే భార్యకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. స్మృతి మందానకు సర్ ప్రైజ్ ప్రపోజల్ చేసి షాక్ ఇచ్చాడు. ఏ ప్రియుడు చేయని పని చేశాడు పలాష్ ముచ్చల్. డివై పాటిల్ ( DY Patil Stadium) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోనే స్మృతి మందానకు ప్రపోజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. స్మృతి మందాన కళ్ళకు గంతలు కట్టి డివై పాటిల్ స్టేడియంలోకి తీసుకువెళ్లాడు పలాష్ ముచ్చల్. ఆ తర్వాత మోకాళ్లపై కూర్చొని స్మృతి మందానకు ప్రపోజ్ చేశాడు పలాష్ ముచ్చల్. ఈ తరుణంలోనే ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి పలాష్ ముచ్చల్ ను గట్టిగా హాగ్ చేసుకుంది స్మృతి మందాన. ఈ సందర్భంగా ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి.
ఈ నెల 23వ తేదీన స్మృతి మందాన అలాగే పలాష్ ముచ్చల్ వివాహం జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర లేఖ రాశారు. ఎంగేజ్మెంట్ ఇప్పటికే చేసుకున్న స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ కు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ ఇద్దరు కూడా వారి వారి రంగాల్లో అద్భుతంగా రాణించి అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు. వీళ్ళ దాంపత్య జీవితం చాలా సంతోషకరంగా ఉండాలని ఆకాంక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ. వారి జీవితంలో ప్రతి మెట్టు సంతోషంగా సాగాలని కోరారు. ఇక అటు పలాష్ ముచ్చల్ ( Palash Muchhal )తో ఎంగేజ్ మెంట్ జరిగినట్లు ఓ వీడియో ద్వారా స్మృతి మందాన పేర్కొన్నారు. టీమిండియా మహిళా క్రికెటర్లు అందరూ రీల్ చేసి, ఈ విషయాన్ని బయటపెట్టారు.
DAMN 😭 https://t.co/sKWpGCJkQe pic.twitter.com/ijETnaeeQ3
— nou (@mandhanahive) November 21, 2025