E-Paper
Advertisement

Agastya Pandya : నటాషా చెంప పగలగొట్టిన హార్థిక్ పాండ్యా కొడుకు

Agastya Pandya : నటాషా చెంప పగలగొట్టిన హార్థిక్ పాండ్యా కొడుకు

Agastya Pandya: టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యా గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన నటాషా స్టాంకోవిచ్ ను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న విషయం విధితమే. పాండ్యాతో విడాకుల తరువాత కొద్ది రోజులు తన స్వదేశానికి బయలుదేరింది నటి నటాషా స్టాంకోవిచ్. మరోవైపు విడాకుల తరువాత కూడా కొడుకుతో మాత్రం తల్లిదండ్రులుగా తమ ఇద్దరి బంధం కొనసాగుతుందని.. అగస్త్య కోసం అన్ని బాధ్యతలు తీసుకుంటానని విడాకుల సమయంలో పాండ్యా స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే అగస్త్య గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. మా కుమారుడు క్రికెట్ ఆడాడు. తాను బ్యాట్ తో బంతిని నా చెంప పగిలింది అని చెప్పుకొచ్చింది నటాషా స్టాంకోవిచ్. ఆ బాల్ సిక్స్ పోయిందని.. కుమారుడిని మాత్రం ఇక్కడ చూడు చూడు చెంప ఎలా అయిందో అంటూ చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : Bomb threat: సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో బాంబు.. ప్రమాదంలో రాజస్థాన్, పంజాబ్ జట్లు

ఇక హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ముంబై జట్టు ఇటీవలే గుజరాత్ జట్టుపై ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న జట్టు ఇప్పుడు నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ సీజన్ లో హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ లో మాత్రం ఒకసారి ఫామ్ లో ఉంటే.. మరోసారి ఫామ్ కోల్పోతున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు  ఇప్పటి వరకు 12 మ్యాచ్ లు ఆడితే వాటిలో కేవలం 7 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మిగతా 5 మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. ఆ తరువాత రెండు మ్యాచ్ లకు రెండు మ్యాచ్ లు విజయం సాధిస్తేనే ప్లే ఆప్స్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. లేదంటే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మిగతా మూడు మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆప్స్ కి వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు జట్టు 16 పాయింట్లు సాధించి ప్లే ఆప్స్ బెర్త్ దాదాపు ఖరారు అయ్యాయి.

మిగతా రెండు జట్లలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో ఏవైనా రెండు జట్లకు మాత్రమే ప్లే ఆప్స్ కి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు ప్రతీ మ్యాచ్ లో విజయం సాధించి.. ఢిల్లీ లేదా ముంబై జట్లు ప్రతీ మ్యాచ్ ఓడిపోతే లక్నో సూపర్ జెయింట్స్ కి కూడా ప్లే ఆప్స్ కి వెళ్లే అవకాశం లేకపోలేదు. కోల్ కతా జట్టు మాత్రం ఆ అవకాశం కోల్పోయిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించే ముంబై ఇండియన్స్ జట్టు నెట్ రన్ రేట్ అధికంగా ఉంది. ఒకవేళ రెండు మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ లో ఓడిపోయినా.. మరో మ్యాచ్ లో విజయం సాధిస్తే.. రన్ రేట్ కారణంగా ముంబై ప్లే ఆప్స్ కి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ సారి ఏ జట్టు ప్లే ఆప్స్ కి చేరుకుంటుందో అస్సలు ఊహించలేకపోవడం విశేషం. దాదాపు టాప్ 5 జట్లు అద్భుతమైన ప్రదర్వన కనబరచడం విశేషం.

?igsh=NHA5MDQ5bHNtZmo=

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×