BigTV English
Advertisement

Operation Sindoor : ఇండియాను తెగ పొగిడేస్తున్న పాకిస్తానీ.. వీడియో వైరల్

Operation Sindoor : ఇండియాను తెగ పొగిడేస్తున్న పాకిస్తానీ.. వీడియో వైరల్

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్. గ్రాండ్ సక్సెస్. టార్గెట్ చేసిన 9 స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. జస్ట్ 25 నిమిషాల్లోనే టాస్క్ ఫినిష్ చేసేసింది. టార్గెట్ కొంచెం కూడా అటూ ఇటు కాలేదు. ప్రయోగించిన మిస్సైల్స్ ఒక్క ఇంచు కూడా డైవర్ట్ కాలేదు. సామాన్య పౌరులు, పాక్ సైనికులకు చిన్న గీత పడలేదు. ఈ మాట చెబుతున్నది మనం కాదు.. ఓ పాక్ పౌరుడు. అందుకే ఇప్పుడు ఆ పాకిస్తానీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాక్ పరువంతా తీస్తోంది. ఇండియా ఇమేజ్ పెంచేస్తోంది.


భారత సైన్యం కచ్చితత్వంతో టార్గెట్‌ను పినిష్ చేసిందని అంటున్నాడు ఆ పాక్ పౌరుడు. ఇజ్రాయిల్, ఇరాన్‌లా దాడులు చేసింటే ఈపాటికి పాక్ శిథిలావస్థకు చేరి ఉండేదని చెబుతున్నాడు. భారత్‌ ఆర్మీ బేస్ క్యాంపులను ధ్వంసం చేశామని పాక్ చెబుతున్నా.. అందులో నిజంలేదంటూ సొంత దేశం ఇజ్జత్ తీసిపడేశాడు.

పాక్ రక్షణ వ్యవస్థపైనా ఆ దేశ పౌరుడి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ మిసైల్స్ దాడి చేస్తే.. పాక్ కనీసం అడ్డుకోలేకపోయిందన్నాడు. ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ దాడి చేసిందని.. ఒకవేళ పాక్‌లోని ఇతర ప్రాంతాల్లో భారత్ దాడి చేసినా చేసేదేమీ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఇండియాకు సపోర్ట్ చేయడం లేదంటూనే.. పాక్ పరువంతా తీసేశాడు.


పాక్ ఫేక్ ప్రచారం

ఇండియాను ఏం చేయలేక.. సోషల్ మీడియానే నమ్ముకుంది పాకిస్తాన్. పరువు నిలబెట్టుకునేందుకు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోంది. గుజ్రాన్‌వాలాలో భారత్ మిస్సైల్‌ను పాక్ కూల్చేసిందని ఓ వీడియో.. పాక్ అనుకూల మీడియాలో వైరల్ అవుతోంది. అది తప్పుడు వార్త అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. పాత వీడయోలు వైరల్ చేసి పాక్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని తెలిపింది. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన మిస్సైల్ శిథిలాలను చూపించి భారత్ క్షిపణిగా పాక్ ప్రచారం చేస్తోందని ఆరోపించింది పీఐబీ.

ఫేక్ వీడియోలే దిక్కా?

అమృత్‌సర్‌లోని భారత సైనిక స్థావరంపై దాడులు చేశామని పాక్ మరో వీడియోని కూడా వైరల్ చేస్తోంది. ఇందులో కూడా నిజంలేదని స్పష్టం చేసింది పీఐబీ. 2024 నాటి కార్చిర్చు వీడియోని ప్రసారం చేసి అమృత్‌సర్‌ సైనిక స్థావరాన్ని ధ్వంసం చేశామని చెప్పుకుంటోందని ప్రకటించింది. తప్పుడు వార్తలకు ప్రభావితం కావొద్దని.. అవాస్తవాలను ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం హెచ్చరించింది.

Also Read : పాకిస్తాన్‌కు కేఏ పాల్.. మోదీతో బిగ్ టాస్క్!

Related News

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Big Stories

×