Ahmed Shehzad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( Indian Premier League Tournament 2026) పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ ( Pakistan Super League 2026) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ చాలా తోపు అంటూ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) నుంచి మొదలుకొని అందరూ విర్రవీగుతున్నారు. ఇలాంటి క్రమంలో అహ్మద్ షెజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఏడవడమేనా? మన పీఎస్ఎల్ గురించి ఒక్కసారి ఆలోచించుకోండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటులో ఐపీఎల్ లో అన్ సోల్డ్ గా ( IPL Unsold) మిగిలిన డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్ లాంటి ప్లేయర్లు మాత్రమే ఉన్నారని.. తోపు ఆటగాళ్లందరూ వెళ్లిపోయినట్లు షాకింగ్ నిజాలను బయటపెట్టారు అహ్మద్ షెజాద్ ( Ahmed Shehzad). రిటైర్మెంట్ ఇచ్చిన ప్లేయర్లు కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడుతున్నారని చురకలు అంటించారు. దీంతో అహ్మద్ షెజాద్ ( Ahmed Shehzad) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Also Read: Akhtar On Naqvi: భూతద్దాలు పెట్టుకోని చూడు..పెట్రోల్ విషయంలో ఇండియా కాలి గోటికి కూడా పాక్ సరిపోదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ పరువు తీశాడు అహ్మద్ షెజాద్ ( Ahmed Shehzad). ఐపీఎల్ అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ మధ్య ఎలాంటి పోలిక లేదని బాంబు పేల్చారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే ఐపీఎల్ తోపు లీగ్ అంటూ వ్యాఖ్యానించారు. పొద్దున లేస్తే ఐపీఎల్ పై పడి ఏడవడం కంటే, పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటును మెరుగుపరచుకోవడం ఉత్తమమని కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీక్ 2026 టోర్నమెంటులో విదేశీ క్రికెటర్లు ఉన్నారు కానీ.. వాళ్ల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని పరువు తీశారు.
ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ అయిన వాళ్ళు… అన్సోల్డ్ గా మిగిలిన వాళ్లు మాత్రమే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో భవిష్యత్తు లేని డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్ లాంటి ప్లేయర్లు మాత్రమే మిగిలిపోయారని పరువు తీశారు అహ్మద్ షెజాద్. ఇలాంటి ఐపీఎల్ రిజెక్టెడ్ ప్లేయర్లు ఆడితే, పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ బ్రాండ్ అస్సలు పెరగబోదని ఎద్దేవా చేశారు అహ్మద్ షెజాద్. ఇండియాలో పెట్రోల్ నిల్వలు సమృద్ధి గానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. అందుకే ప్రేక్షకులతో నిండుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కనిపిస్తోందని వెల్లడించారు. పాకిస్తాన్లో పెట్రోల్ అలాగే డీజిల్ కొరత స్పష్టంగా ఉందని… దీని ఎఫెక్ట్ కారణంగానే అభిమానులు లేకుండా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని నఖ్వీకి కౌంటర్ ఇచ్చారు.
Also Read: Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ కు కూడా లవ్ స్టోరీ…ఔట్ కాగానే కన్నీళ్లు పెట్టుకుంది కదరా
📢 Ahmed Shehzad brutally owned PSL:
You only have players left in the PSL who have either retired from the IPL, gone unsold in the IPL, or have no future in the IPL, like David Warner and Steve Smith. If any current player has a chance to play, they will choose the IPL. So how… pic.twitter.com/2GTSopxZPA
— TEJASH (@Tejashyyyyy) April 14, 2026