E-Paper
Advertisement

Tanveer Ahmed: న్యూజిలాండ్-శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్‌..పాకిస్తాన్ ను ఇంటికి పంపేందుకే ఈ కుట్ర‌లు

Tanveer Ahmed: న్యూజిలాండ్-శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్‌..పాకిస్తాన్ ను ఇంటికి పంపేందుకే ఈ కుట్ర‌లు

Tanveer Ahmed: టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  నేపథ్యంలో బుధవారం రోజున న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక ( New Zealand vs Sri Lanka) మధ్య కీలక మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన శ్రీలంక ఓడిపోయింది. న్యూజిలాండ్ చేతిలో ఏకంగా 61 పరుగుల తేడాతో దారుణ ఓటమి చవి చూసింది. ఈ దెబ్బకు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి శ్రీలంక ఎలిమినేట్ అయింది. అయితే నిన్నటి మ్యాచ్ లో శ్రీలంక గెలిచి ఉంటే, పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు సజీవంగానే ఉండేవి. కానీ శ్రీలంక దారుణంగా ఓడిపోవడం, పాకిస్తాన్ చావుకు వచ్చింది. అద్భుతం జరిగితే తప్ప ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్ సెమీ ఫైనల్ వెళ్లడం కష్టమే.

Also Read: Gautam Gambhir: ఎవ్వ‌డికి ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిల మైకంలోనే ఉంటున్నారు.. డ్రెస్సింగ్ రూంలో క్లాస్ పీకిన గంభీర్‌

శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఫిక్సింగ్.. పాకిస్తాన్ కొత్త డ్రామాలు

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament )  భాగంగా నిన్న న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓడిపోయింది. దీంతో శ్రీలంక ఎలిమినేట్ కావడమే కాకుండా పాకిస్తాన్ ను కూడా వెంటబెట్టుకొని వెళ్లే లాగా కనిపిస్తోంది. అయితే ఈ న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక కావాలనే ఓడిపోయిందని బాంబు పేల్చారు. ఈ రెండు జ‌ట్ల మధ్య ఫిక్సింగ్ ( Match Fixing) జరిగిందని ఆరోపణలు చేశారు తన్వీర్ అహ్మద్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షా ఈ కుట్ర వెనుక ఉన్నాడని మండిపడ్డారు. పాకిస్తాన్ ను ఇంటికి పంపించేందుకే.. అందరూ ఆడిన డ్రామా అంటూ ఫైర్ అయ్యారు. న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓడిపోవడంతో సెమీ ఫైనల్ రేసు నుంచి పాకిస్తాన్ తప్పుకోవాల్సి వస్తోందని దీనంతటికి ఇండియా నే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో తన్వీర్ అహ్మాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ సెమీస్ కు వెళ్లే ఛాన్స్ ఉందా ?

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ సెమీస్ కు ( PAKISTAN SEMI-FINAL QUALIFICATION SCENARIOS ) వెళ్లే ఛాన్స్ ఒకే ఒక్క శాతం ఉంద‌ని అంటున్నారు. ఈ టోర్న‌మెంట్ సూప‌ర్ 8 లో భాగంగా, న్యూజిలాండ్ ను ఇంగ్లాండ్ చిత్తుగా ఓడించాలి. ఒక వేళ న్యూజిలాండ్ పై 15 ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిస్తే, శ్రీలంక పైన 55 ప‌రుగుల తేడాతో పాకిస్తాన్ విజ‌యం సాధించాల్సి ఉంటుంది. అలాగే, న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ ఒకే ఒక్క ప‌రుగు తేడాతో విజ‌యం సాధిస్తే, శ్రీలంక పైన 69 ప‌రుగుల తేడాతో పాకిస్తాన్ విజ‌యం సాధించాలి. అలా అయితే, పాకిస్తాన్ సెమీస్ కు వెళుతుంది. ఒక‌వేళ ఇంగ్లాండ్ పై న్యూజిలాండ్ గెలిస్తే, శ్రీలంక‌తో పాటు పాక్ ఇంటికి వెళ్లాల్సిందే. అప్పుడు ఇంగ్లాండ్ తో పాటు కివీస్ సెమీస్ కు వెళుతుంది.

 

Also Read: Salman Agha: నీ పెళ్లాన్ని రేప్ చేస్తాం, కొడుకును చంపేస్తాం…పాక్ కెప్టెన్ స‌ల్మాన్ ఫ్యామిలీకి వేధింపులు

 

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×